News March 15, 2025
BREAKING: ఉప్పల్ సమీపంలో రోడ్డుప్రమాదం

డీసీఎం, బైక్ ఢీకొనటంతో ఓ ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఉప్పల్ భగాయత్ పరిధి ఫైర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా జరిగింది. ఉప్పల్ నుంచి నాగోల్ వైపు భగాయత్ మీదుగా వెళ్లే మార్గంలో ఓ వ్యక్తి బైక్పై ప్రయాణిస్తూ వెళుతుండగా వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొట్టినట్లు అక్కడి వారు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Similar News
News March 15, 2025
కోటరీ వల్ల రాజూ పోయేవాడు.. రాజ్యమూ పోయేది: VSR

AP: పూర్వం కోటల్లో రాజుగారి చుట్టూ కోటరీ ఉండేదని, రాజ్యం ఎలా ఉన్నా ఆహా రాజా! ఓహో రాజా అంటూ తమ ఆటలు సాగించుకునేవారని విజయసాయి రెడ్డి అన్నారు. దీంతో రాజూ పోయేవాడు, రాజ్యం కూడా పోయేదని ట్వీట్ చేశారు. ‘కోటలో రాజు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు, కోటా మిగలదు’ అని పేర్కొన్నారు. ఇటీవల జగన్ చుట్టూ కోటరీ ఉందని VSR ఆరోపించిన విషయం తెలిసిందే.
News March 15, 2025
NRPT: ‘హక్కుల చట్టంపై అవగాహన కలిగి ఉండాలి’

వినియోగదారుల హక్కుల చట్టంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా పరిషత్ సీఈఓ భాగ్యలక్ష్మి అన్నారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్లో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మానవ జీవితంలో వస్తువుల వినియోగం తప్పనిసరి అని అన్నారు. వాటిని కొనుగోలు చేసిన సందర్భంలో నకిలీ వస్తువులుగా గుర్తిస్తే విక్రయించిన వారిపై ఫిర్యాదు చేయాలన్నారు.
News March 15, 2025
రాజమండ్రి: రైల్వే చీఫ్ క్రూ కంట్రోలర్గా శ్రీనివాసరావు

దక్షిణ మధ్య రైల్వే రాజమండ్రిలో చీఫ్ క్రూ కంట్రోలర్గా శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఇదే పదవిలో ఉన్న బీవీ బీకే రెడ్డి స్వచ్ఛందంగా రిటైరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన నుంచి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఉన్నతాధికారులు, క్రిందిస్థాయి ఉద్యోగులను సమన్వయం చేసుకుంటూ తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తానని శ్రీనివాసరావు తెలిపారు.