News February 6, 2025
BREAKING: మహబూబ్నగర్ జిల్లాలో MURDER

మహబూబ్నగర్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నందికొట్కూర్ వాసి షేక్ అబ్దుల్ రహమాన్ కూతురిని అదే గ్రామానికి చెందిన అలీ ఖాన్(36) తరచూ వేధిస్తున్నాడు. ఈక్రమంలో చిన్నచింతకుంట మండలం తిరుమలాపూర్లో ఈరోజు కూడా మళ్లీ ఆమెను వేధించసాగాడు. విషయం తెలుసుకున్న అబ్దుల్ రహమాన్ తన కూతురిని వేధిస్తావా అంటూ అలీని రాడ్డుతో కొట్టి చంపేశాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని తరలించారు.
Similar News
News December 16, 2025
సిరిసిల్ల: ‘కుష్ఠు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి’

కుష్ఠు వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ రజిత పేర్కొన్నారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో జాతీయ కుష్ఠువ్యాధి నిర్మూలన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో డాక్టర్ రజిత మాట్లాడుతూ.. ఈనెల 18 నుంచి జిల్లాలో ఇంటింటా కుష్ఠు వ్యాధి గుర్తింపు నిర్వహిస్తామన్నారు.
News December 16, 2025
చిత్తూరు: ఫేక్ GST రిజిస్ట్రేషన్.. రూ.కోట్ల లావాదేవీలు.!

చిత్తూరు జిల్లాలో ఫేక్ GST ఘటనలో ఇప్పటి వరకు 80-100 వరకు కేసులు నమోదైనట్లు సమాచారం. ఓ తుక్కు వ్యాపారి ఫేక్ GST ఫర్మ్ రిజిస్ట్రేషన్ ద్వారా దాదాపు రూ.50 కోట్ల వరకు ట్యాక్స్ ఎగొట్టినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లా నుంచి తుక్కును మహారాష్ట్ర వరకు పంపి కాసుల వర్షం కురిపించుకుంటున్నారట. కొందరైతే ఎలాంటి ఫర్మ్ లేకుండా తుక్కు రవాణా చేస్తున్నట్లు సమాచారం.
News December 16, 2025
వే2న్యూస్ రీల్ రిపోర్టర్: ₹15,000కు పైగా సంపాదించే అవకాశం

Way2News ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 2000 మందికి పైగా రీల్ రిపోర్టర్ల కోసం చూస్తోంది. మీకు కావలసిందల్లా ప్యాషన్, ఒక స్మార్ట్ఫోన్ మాత్రమే. న్యూస్ & ఇన్ఫర్మేటివ్ వీడియో రీల్స్ క్రియేట్ చేయండి. మీ కంటెంట్కి తగ్గట్టు ప్రతి నెల ₹15,000కు పైగా సంపాదించవచ్చు. రీల్ రిపోర్టర్ ప్రోగ్రామ్లో ఎవరైనా జాయిన్ కావచ్చు. వివరాలకు <


