News August 31, 2024
BREAKING: మేడ్చల్ నాదం చెరువు తూము ధ్వంసం చేసిన దుండగులు
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని వెంకటాపూర్ నాదం చెరువు తూమును దుండగులు ధ్వంసం చేశారు. దీంతో చెరువు నీళ్లు దిగువకు పోటెత్తాయి. నాదం చెరువు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. MLA పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన విద్యాసంస్థలని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్టుపై ఇటీవల పోచారం పీఎస్లో కేసు నమోదైంది. దుండగులపై చర్యలు తీసుకోవాలని ఏఈఈకి ఫిర్యాదు చేశారు.
Similar News
News September 30, 2024
HYD: కాసేపట్లో DSC రిజల్ట్స్.. అభ్యర్థులు వీరే!
DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఎస్జీటీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ
RR 3231 205 1:15
HYD 2487 285 1:09
MDCL 646 41 1:15
VKB 4630 169 1:27
News September 30, 2024
HYD: నేడు అత్తాపూర్కు కేటీఆర్ రాక
మూసీ నిర్వాసితులను పరామర్శించడానికి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోమవారం అత్తాపూర్లోని లక్ష్మీనగర్ కాలనీ, నందనవనం అపార్ట్మెంట్స్కు రానున్నారని ఆ పార్టీ నేత కొలను సుభాష్ రెడ్డి తెలిపారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్లో ఇళ్లు కోల్పోతున్న బాధితులను పరామర్శించి వారితో మాట్లాడతారని పేర్కొన్నారు.
News September 30, 2024
HYD: విదేశాల్లో చదువుకునేందుకు BEST CHANCE
మహాత్మా జ్యోతిబా ఫులే విదేశీ విద్యా పథకం కింద అర్హులైన HYD, RR, MDCL, VKBలోని బీసీ, ఈబీసీ విద్యార్థులు అక్టోబర్ 15లోగా ఈపాస్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు. 35 ఏళ్లు, ఇంజనీర్, మేనేజ్మెంట్ సైన్స్, వ్యవసాయం, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సెన్స్, అగ్రికల్చర్లో 60% మార్కులు సాధించాలని పేర్కొన్నారు. విదేశీ వర్సిటీల నుంచి ఐ-20 ఫామ్ పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.