News January 24, 2025

BREKING: రూ.1,000 కోసం రెండు హత్యలు

image

ఇద్దరి స్నేహితులను హత్య చేసిన మరో ఇద్దరు స్నేహితులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ACP రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. ఒక హత్య కేసు శోధిస్తుంటే మరో హత్య కేసు బయటపడిందని, కేవలం రూ.వెయ్యి కోసం ఈ హత్యలు జరిగాయని ఆయన తెలిపారు. ఈ మేరకు బహదూర్, యూసుఫ్ అనే మిత్రులను హత్య చేసిన అమర్ ఖాన్, రియాజ్ ఖాన్‌లను సాంకేతిక ఆధారాలతో అరెస్ట్ చేసినట్లు వివరించారు. సౌత్ రూరల్ సీఐ సురేష్ పాల్గొన్నారు.

Similar News

News November 22, 2025

మెదక్: మరింత పైకి కూరగాయల ధరలు..!

image

కూరగాయల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తుఫాన్, అకాల వర్షాల వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడి తగ్గడం, కార్తీక్ మాసంలో కూరగాయల వినియోగం పెరగడం వంటి కారణాలతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మార్కెట్లలో పాలకూర రూ.120, చిక్కుడు రూ.100, బీరకాయ రూ.100, బెండకాయ రూ.80, వంకాయ రూ.80 పలుకుతున్నాయి. మీ ప్రాంతంలో కూరగాయల ధరలు పెరిగాయా కామెంట్ చేయండి.

News November 22, 2025

విద్యార్థినుల కోసం కొత్త పథకం: మంత్రి లోకేశ్

image

AP: వచ్చే ఏడాది నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ‘దేశవిదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే విద్యార్థినులకు ఆర్థిక సాయం అందిస్తాం. ప్రస్తుతం విదేశాల్లో APకి చెందిన 27,112 మంది, స్వదేశంలో 88,196 మంది విద్యార్థినులు ఉన్నత చదువులు చదువుతున్నారు’ అని ట్వీట్ చేశారు.

News November 22, 2025

వరంగల్ సెంట్రల్ జైలు నిర్మాణం ఎప్పుడు..?

image

నిజాం కాలం నాటి WGL సెంట్రల్ జైలు 2021లో కూల్చగా, మామునూరులో కొత్త జైలు నిర్మిస్తామని ప్రకటించినా నాలుగున్నరేళ్లుగా పనులు మొదలుకాలేదు. వెయ్యి మంది ఖైదీలను ఇతర జైళ్లకు మార్చడంతో వారి కుటుంబాలు కలుసుకోవడానికే ఇబ్బందులు పడుతున్నారు.101 ఎకరాలు కేటాయించినా బడ్జెట్ లేక పనులు నిలిచాయి. ప్రస్తుతం మామునూరులో 20 మంది ఖైదీలకు 40 మంది సిబ్బంది పని చేస్తుండగా, కొత్త జైలు నిర్మాణంపై ప్రభుత్వం స్పందించడం లేదు.