News January 24, 2025

BREKING: రూ.1,000 కోసం రెండు హత్యలు

image

ఇద్దరి స్నేహితులను హత్య చేసిన మరో ఇద్దరు స్నేహితులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ACP రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. ఒక హత్య కేసు శోధిస్తుంటే మరో హత్య కేసు బయటపడిందని, కేవలం రూ.వెయ్యి కోసం ఈ హత్యలు జరిగాయని ఆయన తెలిపారు. ఈ మేరకు బహదూర్, యూసుఫ్ అనే మిత్రులను హత్య చేసిన అమర్ ఖాన్, రియాజ్ ఖాన్‌లను సాంకేతిక ఆధారాలతో అరెస్ట్ చేసినట్లు వివరించారు. సౌత్ రూరల్ సీఐ సురేష్ పాల్గొన్నారు.

Similar News

News December 6, 2025

రూ.100కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్

image

AP: అతి తక్కువ ధరకే వారసత్వ వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నామమాత్రపు స్టాంపు డ్యూటీ వసూలుతో రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తూ తాజాగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ రూ.10 లక్షలలోపు ఉంటే రూ.100, దానికంటే ఎక్కువైతే రూ.1,000 స్టాంపు డ్యూటీ వసూలు చేస్తారు. భూ యజమాని మరణించిన తర్వాత వారసులకు సంక్రమించిన ఆస్తులకే ఈ రాయితీ వర్తిస్తుంది.

News December 6, 2025

కొక్కెర వ్యాధి – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

కోళ్ల షెడ్డును శుభ్రంగా ఉంచి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. సంతలో కొన్న పెట్టలను, పుంజులను టీకాలు వేయకుండా షెడ్డులో కోళ్లతో కలిపి ఉంచకూడదు. పెద్ద, చిన్న కోళ్లను వేరువేరుగా ఉంచాలి. వెటర్నరీ నిపుణుల సూచనలతో కోడిపిల్లలు పుట్టిన తొలి వారంలోనే F1(RD)/Lasota టీకా మందు కంటిలో/ముక్కులో వేస్తే 6 వారాల వరకు ఈ కొక్కెర వ్యాధి రాదు. కోళ్లకు ఆరు వారాల వయసులో R2B (R.D.) వ్యాక్సిన్ 0.5 ml s/c వేయాలి.

News December 6, 2025

KNR: రూ.4.50CR SCAM.. ఎంక్వయిరీ రిపోర్ట్ ఎక్కడ..?

image

కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.4.5 కోట్ల అవినీతి ఆరోపణలపై TVVP రెండు బృందాలతో విచారణ చేపట్టింది. దీనిపై ఎంక్వయిరీలో ఏం తేలిందన్నది బహిర్గతం చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రభుత్వంలోని ఓ కీలక నేత రిపోర్టు బయటకు రాకుండా తొక్కిపెడుతున్నాడన్న చర్చ జోరుగా నడుస్తోంది. దీనిపై మంత్రులు జోక్యం చేసుకొని నిజానిజాలు బయట పెట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.