News October 22, 2024
BRICS SIDELINES: మోదీ, జిన్పింగ్ భేటీ కాబోతున్నారా!
BRICS సదస్సు కోసం రష్యా వెళ్లిన PM నరేంద్ర మోదీతో చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ ఇప్పటికే దీనిపై హింట్ ఇవ్వడం గమనార్హం. ఏర్పాట్లపై ఫోకస్ పెట్టామన్నారు. గల్వాన్ లోయలో 2 దేశాల సైనికుల బాహాబాహీ తర్వాత జిన్పింగ్ను కలిసేందుకు మోదీ ఆసక్తి చూపలేదు. నిన్ననే LAC వద్ద డిస్ఎంగేజ్మెంట్ ఫైనలైజ్ అవ్వడంతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
Similar News
News October 22, 2024
గ్యాంగ్ రేప్ నిందితులతో టీడీపీకి సంబంధాలు: వైసీపీ
AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో విద్యార్థినులపై అత్యాచారం చేసిన నిందితులకు TDPతో సంబంధాలు ఉన్నాయని YCP ఆరోపించింది. నిందితుడు శివ బంధువు జానకీరావు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి, మరో నిందితుడు మోహన్ వాళ్ల మామ ఎమ్మెల్యే గౌతు శిరీషకు అనుచరుడని తెలిపింది. దీంతో బాధితులకు నిందితులకు మధ్య రాజీకి ప్రయత్నాలు చేశారని పేర్కొంది. కూటమి నేతలు శాడిస్ట్లను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టింది.
News October 22, 2024
వాట్సాప్తో ప్రభుత్వం ఒప్పందం
AP: కాస్ట్ సహా ఇతర సర్టిఫికెట్లు, పౌరసేవలు వాట్సాప్లో పొందేలా మెటా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం MOU చేసుకుంది. కరెంట్, వాటర్, ఇంటి పన్ను, ఇతర బిల్లులు ఇకపై వాట్సాప్లోనే చెల్లించవచ్చు. నకిలీలు, ట్యాంపరింగ్ అవకాశం లేకుండా పారదర్శకంగా ఆన్లైన్లోనే సర్టిఫికెట్లు ఇవ్వనుంది. మెటా నుంచి టెక్నికల్ సపోర్ట్, ఈ గవర్నెన్స్, AI ద్వారా మరిన్ని సిటిజెన్ సర్వీసెస్ ఏపీ ప్రభుత్వానికి అందించనుంది.
News October 22, 2024
రేవంత్ తిట్లను కేటీఆర్ తట్టుకోలేడు: జగ్గారెడ్డి
TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన దామగుండం రాడార్ స్టేషన్పై పిల్లచేష్టలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ తిడితే కేటీఆర్ తట్టుకోలేరన్నారు. ఆయనకు కష్టమంటే తెలియదని చెప్పుకొచ్చారు. రేవంత్ కష్టపడి ఎదిగారని, ప్రజల బాధలు ఆయనకు తెలుసన్నారు. కేసీఆర్ సైతం ఎన్నో కష్టాలు ఎదుర్కొని పైకి వచ్చారని జగ్గారెడ్డి అన్నారు.