News July 31, 2024

తల్లి నగలపై బ్రిటన్ రాజకుటుంబంలో చిచ్చు

image

దివంగత బ్రిటన్ ప్రిన్సెస్ డయానా నగల విషయంలో ఆమె వారసులు విలియం, హ్యారీ మధ్య చిచ్చు రగిలిందని రచయిత రాబ్ జాబ్సన్ ‘కేథరిన్, ది ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్’ పుస్తకంలో తెలిపారు. ‘నటి మేఘన్ మార్కెల్‌ను హ్యారీ పెళ్లి చేసుకోవడం రాజకుటుంబానికి అస్సలు ఇష్టం లేదు. అందుకే తమ తల్లి నగల్ని మేఘన్‌కు ఇవ్వనని విలియం తేల్చిచెప్పారు. ఆ విభేదాల కారణంగానే హ్యారీ దంపతులు రాచరికాన్ని వదిలేసుకున్నారు’ అని వెల్లడించారు.

Similar News

News December 6, 2025

శ్రీశైలం: పాతాళగంగ నీరు పచ్చగా ఎందుకు?

image

చంద్రగుప్త మహారాజు ఓ రాజ్యాన్ని ఓడించి, అంతఃపురంలో ఉన్న రాణిని తన కూతురని తెలియక ఆశించాడు. ఆ విషయం తెలిసినా వెనక్కి తగ్గలేదు. దీంతో చంద్రవతి శ్రీశైలం వచ్చి శివుడిని ప్రార్థించింది. అక్కడకు వచ్చిన చంద్రగుప్తుడు చంద్రవతిని చెడగొట్టబోతుండగా, శివుడు ప్రత్యక్షమయ్యాడు. కామంతో కనులు మూసుకుపోయిన చంద్రగుప్తుడిని పచ్చలబండపై పాతాళగంగలో పడి ఉండమని శాపమిచ్చాడు. అందుకే పాతాళగంగ నీరు పచ్చగా ఉంటుందని కథనం.

News December 6, 2025

టాస్ గెలిస్తే.. సిరీస్ గెలిచినట్లే!

image

సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌ 1-1తో సమమైన విషయం తెలిసిందే. విశాఖ వేదికగా ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ గెలవాలంటే టీమ్ ఇండియా ఇవాళ టాస్ గెలవాలి. మొదట బ్యాటింగ్ చేసి ఎంత భారీ స్కోర్ చేసినా.. రెండో ఇన్నింగ్స్‌లో మంచు దెబ్బకు బౌలింగ్ తేలిపోతోంది. ఇటీవల ఉమెన్స్ వరల్డ్ కప్‌లో విశాఖలో జరిగిన 5 ODIల్లో ఛేజింగ్ టీమే గెలిచింది. ఏ విధంగా చూసినా ఇవాళ్టి మ్యాచ్‌లో టాసే కీలకంగా కనిపిస్తోంది.

News December 6, 2025

ఇండిగో.. రిఫండ్ చేస్తే సరిపోతుందా?

image

ఇండిగో ఫ్లైట్స్ రద్దవడంతో వేలమంది ఇబ్బంది పడ్డారు. CEO సారీ కూడా చెప్పారు. టికెట్ డబ్బు రిఫండ్ చేస్తామన్నారు. చాలామంది జర్నీ క్యాన్సిల్ చేసుకున్నారు. దాంతో వాళ్లు ముందుగానే బుక్ చేసుకున్న హోటల్స్ రిఫండ్ చేస్తాయో లేదో తెలీదు. వేరే ఫ్లైట్స్‌కి వెళ్లిన వాళ్లు రూ.7 వేల టికెట్‌ని రూ.50 వేలకు కొన్నారు. ఇలా ఏదోలా ప్రయాణికులు నష్టపోయారు. మరి ఇండిగో కేవలం టికెట్ డబ్బు రిఫండ్ చేస్తే సరిపోతుందా? COMMENT.