News April 12, 2025
మార్క్ శంకర్కు బ్రోన్కో స్కోపీ.. ఖర్చు ఎంతంటే?

సింగపూర్ అగ్నిప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్కు <<16039701>>బ్రోన్కో స్కోపీ<<>> చికిత్సను అందించిన సంగతి తెలిసిందే. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో పరిస్థితిని బట్టి చికిత్స అందిస్తారు. దీనికి రూ.5 వేల నుంచి రూ.35 వేల వరకు ఖర్చు అవుతుందని సమాచారం. మరోవైపు చికిత్స తీసుకున్న ఆసుపత్రిలో బిల్లు లక్షల్లో ఉంటుందని చర్చ జరిగినా తక్కువ ఖర్చులోనే ట్రీట్మెంట్ పూర్తైందని తెలుస్తోంది.
Similar News
News October 29, 2025
ఏపీలో ఆ జిల్లాల్లో సెలవులు.. కాకినాడలో రద్దు

తుఫాను క్రమంగా బలహీనపడటంతో ఏపీలోని కాకినాడ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు రద్దు చేశారు. ఈ నెల 31వరకు సెలవులు ఇవ్వగా పరిస్థితి అదుపులోకి రావడంతో విద్యార్థులు రేపటి నుంచే స్కూళ్లు, కాలేజీలకు రావాలని అధికారులు ఆదేశించారు. అటు విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవు ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లో యథాతథంగా స్కూళ్లు, కాలేజీలు ఉంటాయని స్పష్టం చేశారు.
News October 29, 2025
వైఫల్యాలు విజయాలకు మెట్లు!

మీరు చేసిన ప్రయత్నాలు విఫలం అవుతున్నాయని బాధపడుతున్నారా? విజయం పొందలేమని ఆందోళన చెందుతున్నారా? మీలానే సర్ జేమ్స్ డైసన్ అనుకుని తన ప్రయత్నాలను ఆపితే బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్ రూపొందేదా? ఆయన ఏకంగా 5,126 సార్లు విఫలమయ్యారు. ప్రస్తుతం ఆయన స్థాపించిన డైసన్ లిమిటెడ్ కంపెనీ వార్షికాదాయం ₹75,300 కోట్లు. వైఫల్యం అనేది ఆగిపోవడానికి సంకేతం కాదు.. ఇది విజయానికి మెట్టు అని గుర్తుంచుకోండి.
News October 29, 2025
పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేయాలి: CBN

AP: వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల్ని వేగంగా చేపట్టాలని CM CBN ఆదేశించారు. నీరు నిలవకుండా డ్రైనేజీల్ని పటిష్ఠం చేయాలన్నారు. విద్యుత్తు సరఫరా, రహదారుల పునరుద్ధరణ పనులను తక్షణమే చేపట్టాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లోని వారికి నిత్యావసరాలు అందించాలన్నారు. కాగా రాష్ట్రంలో 249 మండలాలు, 1,434 గ్రామాలు, 48 మున్సిపాలిటీల్లోని 18 లక్షల మందిపై తుఫాను ప్రభావం పడిందని అధికారులు వివరించారు.


