News April 10, 2025
లండన్లో ఆ హీరోహీరోయిన్ల కాంస్య విగ్రహాలు

భారత సినీ చరిత్రలో ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. విడుదలై 30 ఏళ్లు గడచిన సందర్భంగా ఆ మూవీకి లండన్లో అరుదైన గౌరవం దక్కనుంది. అక్కడి లైసెస్టర్ స్క్వేర్లో DDLJ హీరోహీరోయిన్లు షారుఖ్, కాజోల్ కాంస్య విగ్రహాల్ని నెలకొల్పనున్నారు. ఈ ఘనత దక్కించుకున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఈ ఏడాది చివరిలోపు విగ్రహాల్ని ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News April 18, 2025
IPL: SRH చెత్త రికార్డ్

MIతో నిన్నటి మ్యాచ్లో ఓటమితో SRH బయటి పిచ్ల మీద పరాజయాల పరంపర కొనసాగించింది. ఈ సీజన్లో ఉప్పల్లో కాకుండా SRH వైజాగ్, కోల్కతా, ముంబైలో మ్యాచ్లు ఆడి, వాటన్నింటిలోనూ ఓడింది. మరోవైపు, మిగతా అన్ని జట్లు బయట ఆడిన మ్యాచ్లు గెలిచాయి. ఉప్పల్ వంటి బ్యాటింగ్ పిచ్ అయితే SRH భారీ స్కోర్ చేస్తుండటం గమనించిన మిగతా జట్లు స్లో పిచ్లను సిద్ధం చేయిస్తున్నాయి. ఆపై తక్కువ రన్స్కే కట్టడి చేసి నెగ్గుతున్నాయి.
News April 18, 2025
నీళ్లు తరలించకుండా చూడండి.. కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ

TG: కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. జులై వరకూ తాగునీటి అవసరాల కోసం రాష్ట్రానికి 16.20TMCల నీరు కావాలని బోర్డుకు తెలిపింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల కింద రాష్ట్రానికి తాగు, సాగు నీటి అవసరాలకు 29.79 TMCల నీరు రావాల్సి ఉందంది. ఇప్పటికే కేటాయించిన వాటా కంటే అదనంగా AP వినియోగించుకుందని, ఇకపై నీటిని తరలించకుండా చూడాలని నీటి పారుదల ENC కృష్ణా బోర్డును కోరారు.
News April 18, 2025
భూ భారతి.. కలెక్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

TG: ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను సమీక్షించి అప్రూవ్ లేదా రిజెక్ట్ చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈనెల 14 నుంచి వచ్చిన కొత్త అప్లికేషన్లను భూ భారతి చట్టం ప్రకారం పరిష్కరించాలని సూచించింది. అప్లికేషన్లను తిరస్కరిస్తే అందుకు గల కారణాలను స్పష్టంగా నమోదు చేయాలని తెలిపింది. దరఖాస్తుదారులు చూపించిన ఆధారాల ప్రకారం సమస్యల పరిష్కారానికి అవకాశం ఇవ్వాలని పేర్కొంది.