News November 13, 2024
బ్రదర్.. ఇకనైనా లేచి పాదాలకు పనిచెప్పు!

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటే ప్రమాదకరమని తెలిసినా లేచి నడిచేందుకు కొందరు ఇష్టపడరు. ఇలా సుదీర్ఘంగా కూర్చొని పనిచేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. 2 గంటల పాటు కుర్చీలో కూర్చోవడం సిగరెట్ తాగినంత హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేస్తే మధుమేహం, గుండె జబ్బులొస్తాయి. మెడ, వెనుక భాగంలో నొప్పి వస్తుంది. జీవక్రియ నెమ్మదిస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పడిపోతుంది. SHARE IT
Similar News
News November 5, 2025
నేడు కార్తీక పౌర్ణమి.. మాంసాహారానికి దూరంగా ఉండాలన్న పండితులు

అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు మాంసాహారానికి దూరంగా ఉండాలని, శాకాహారమే తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఉపవాసం ఆచరించి నియమాలు పాటిస్తే శుభఫలితాలు పొందుతారని, సాయంత్రం దీపారాధన తర్వాత పండ్లు తినొచ్చని అంటున్నారు. అలాగే ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయాలని, ఈ రోజు వెండి పాత్రలు, పాలను ఎవరికీ దానం చేయకూడదని పేర్కొంటున్నారు. ఇంట్లో ఏ మూలా చీకటి ఉండకూడదని వివరిస్తున్నారు.
News November 5, 2025
సినిమా అప్డేట్స్

* తాను నటిస్తోన్న ‘అనగనగా ఒక రాజు’ చిత్రం కోసం హీరో నవీన్ పొలిశెట్టి ఓ పాట పాడారు. దీన్ని ఈ నెల మూడో వారంలో మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం JAN 14న విడుదల కానుంది.
* సుధా కొంగర డైరెక్షన్లో శివకార్తికేయన్ నటిస్తోన్న ‘పరాశక్తి’ నుంచి ఫస్ట్ సింగిల్ రేపు రిలీజవనుంది.
* తాను రీఎంట్రీ ఇస్తున్నట్లుగా వస్తున్న వార్తలు నిరాధారమని, ఎలాంటి చిత్రాలనూ నిర్మించడం లేదని బండ్ల గణేశ్ స్పష్టం చేశారు.
News November 5, 2025
APSRTCలో 277 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

<


