News September 25, 2024
BRS ఏం చేసిందో, కాంగ్రెస్ అదే చేస్తోంది: కూనంనేని

సింగరేణి లాభాలకు వాటా సంబంధించి ప్రభుత్వంపై విమర్శ చేసే క్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ బాధ్యత వహించాలని కేటిఆర్ చేసిన వ్యాఖ్యలను కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు తప్పుపట్టారు. BRS ప్రభుత్వం ఏమి చేసిందో, ఈ ప్రభుత్వం కూడా అదే చేసిందని చెప్పారు. BRS ప్రభుత్వం పాక్షికంగా కార్మికులకు వాటాలను పంచిందని చెప్పారు. రూ.4701 కోట్లు కాగా రూ.2412 కోట్ల నికర లాభాల నుండి 33% ఇచ్చారని అన్నారు.
Similar News
News February 27, 2026
ఏరుగట్లలో గుప్తనిధుల కలకలం..!

పెనుబల్లి మండలం ఏరుగట్లలో గుప్తనిధుల వేట కలకలం రేపింది. గురువారం అర్ధరాత్రి ముత్యాలమ్మ గుడి సమీపంలో క్షుద్రపూజలు నిర్వహిస్తూ, జేసీబీతో తవ్వకాలు జరుపుతుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో నిందితులు పట్టుబడ్డారు. ముగ్గురు పూజారులను అదుపులోకి తీసుకున్న వీఎం బంజర్ పోలీసులు..ఘటనా స్థలంలో జేసీబీ, మూడు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 27, 2026
పోలీస్ భవనాల ప్రారంభానికి డీజీపీ.. ఖమ్మంలో హై అలర్ట్

రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. నూతన పోలీస్ భవనాల ప్రారంభోత్సవం నిమిత్తం ఆయన వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఇటీవల వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారం ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో డీజీపీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాలో నెలకొన్న సున్నిత పరిస్థితుల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News February 26, 2026
వెలుగుమట్ల భూదాన్ భూములపై కలెక్టర్ వివరణ

ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల అంశంపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం వివరణ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. లంచ్ మోషన్ పిటిషన్ను కూడా కోర్టు తిరస్కరించిందన్నారు. సుమారు రూ.250 కోట్ల విలువైన భూమిని రక్షించామని, అర్హులైన పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.


