News April 17, 2024
BRS ఏనాడు పట్టించుకోలేదు: సునీత మహేందర్ రెడ్డి

మల్కాజ్గిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు యునైటెడ్ హైదరాబాద్ ఫ్రంట్ తమిళ్స్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తమిళ్ భవన్ కోసం ఎన్నో సార్లు BRS ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోలేదని, యునైటెడ్ HYD తమిళ్ ఫ్రంట్ అధ్యక్షులు సాయి కాంత్ అన్నట్లుగా తెలియజేశారు.
Similar News
News November 24, 2025
HYDలో రూ.850 కోట్లు.. ఇందులో మీవీ ఉండొచ్చు!

1, 2 కాదు అక్షరాలా రూ.1,150 కోట్లు ఉన్నాయి తీసుకోండి అని వివిధ బ్యాంకుల అధికారులు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ప్రజలను కోరుతున్నారు. రూ.850 కోట్ల అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఈ 2 జిల్లాల్లోని బ్యాంకుల్లోనే ఉంది. హైదరాబాద్ జిల్లాలోని బ్యాంకుల్లో రూ.850 కోట్లు, రంగారెడ్డి జిల్లాలోని బ్యాంకులలో రూ.300 కోట్లు ఉన్నాయి. వచ్చేనెల 31లోపు ఖాతాదారులు, వారి నామినీలుగానీ ఈ మొత్తాన్ని డ్రా చేసుకోవచ్చు.
SHARE IT
News November 24, 2025
HYD: డిజిటల్ ప్రపంచంలో భద్రత తప్పనిసరి: సీపీ

హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రజలకు కీలక సూచన చేశారు. ‘డిజిటల్ ప్రపంచంలో భద్రత తప్పనిసరి. మీ డేటా, మీ జీవితానికి కీలకం. దాన్ని మీరే కాపాడుకోవాలి. డేటా చోరీ జరిగితే, ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1930కు కాల్ చేయండి. లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి’ అని Xలో ట్వీట్ చేశారు.
News November 24, 2025
HYD: సర్కార్ దవాఖానాలకు ‘మందుల’ సుస్తి

నగరంలో పేదలకు వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు అత్యవసర మందుల కోసం అవస్థలు పడుతున్నాయి. పేట్ల బురుజు, నీలోఫర్, MNJ క్యాన్సర్ హాస్పిటల్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులు అత్యవసర రోగులకు మందులు అందించలేక పోతున్నాయి. నిధుల కొరతతో ఈ సమస్య నెలకొన్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.300 కోట్ల నిధులు జాప్యంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు.


