News November 28, 2024
BRS నేతలకు మహేశ్ కుమార్ గౌడ్ సవాల్

టీపీసీసీ ఛీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ BRS నేతలకు సవాల్ విసిరారు. దమ్ముంటే దిలావర్పూర్లోని ఇథనాల్ పరిశ్రమ గురించి ముఖాముఖి చర్చకు రమ్మన్నారు. ఫ్యాక్టరీకి BRS ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందని, తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ ఆ కంపెనీ డైరెక్టర్గా ఉన్నాడని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన ఫ్యాకర్టీ గురించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు.
Similar News
News November 10, 2025
TU అధికారులు వెంటనే హైకోర్టు తీర్పును అమలు చేయాలి: AISF

TUలో 2012లో ఉద్యోగ నోటిఫికేషన్లో జరిగిన నియామకాలను రద్దు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును TU అధికారులు వెంటనే అమలు చేయాలని AISF యూనివర్సిటీ కన్వీనర్ సంజీవ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ టీయూ అధికారులు తమకు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు. యూనివర్సిటీ వీసీ, రిజిస్టర్ వెంటనే స్పందించాలన్నారు.
News November 10, 2025
NZB: రోడ్డు ప్రమాదంలో గాయపడిన సిబ్బందిని పరామర్శించిన CP

నిజామాబాద్లో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన హోంగార్డు, మహిళా కానిస్టేబుల్ను నిజామాబాద్ సీపీ సాయి చైతన్య సోమవారం పరామర్శించారు. సాయి నగర్-2 నుంచి హోంగార్డ్ అల్లం భూమయ్య ఆయన కూమర్తె మహిళా కానిస్టేబుల్ అల్లం మాధురిని నిన్న రాత్రి బైక్పై విధులకు తీసుకొస్తుండగా ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
News November 10, 2025
NZB: 3.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

జిల్లాలో ఇప్పటికే దాదాపు 50% మేర 3.47 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ పూర్తి చేయడంతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని డిప్యూటీ CM భట్టి విక్రమార్క అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో సేకరించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించారు.


