News December 18, 2024

BRS నేతల నిరసనపై మంత్రి సీతక్క కామెంట్స్

image

అసెంబ్లీలో ఈరోజు నల్లచొక్కాలు ధరించి, చేతులకు బేడీలతో BRS నేతలు చేసిన నిరసనపై మంత్రి సీతక్క కామెంట్స్ చేశారు. KTR, హరీశ్ బేడీలు వేసుకోలేదని, కేవలం వారి పార్టీ MLAలకే బేడీలు వేశారన్నారు. ఈ ఘటనతో KTR, హరీశ్ దొరతనం మరోసారి బయటపడిందన్నారు. నిరసనలో కూడా BRS నేతల్లో సమానత్వం లేదని, తమ దురంహకారాన్ని ప్రదర్శించారని మండిపడ్డారు. రైతులకు బేడీలు వేసిన అంశంపై CM సీరియసై చర్యలు తీసుకున్నారన్నారు.

Similar News

News October 28, 2025

వరంగల్ మెట్ల బావిని ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ

image

కాకతీయుల వారసత్వానికి ప్రతీకగా నిలిచిన చారిత్రక వరంగల్ మెట్ల బావిని మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. స్థానిక ప్రజల సమక్షంలో ఆమె బావిని ప్రారంభించి నీటి సంరక్షణ ప్రాధాన్యతను వివరించారు. కాకతీయుల శిల్పకళను కాపాడటం మనందరి బాధ్యత అని తెలిపారు. సొరంగ మార్గం ద్వారా రుద్రమదేవి ఈ బావికి వచ్చేదని ప్రతీతి అని గుర్తు చేశారు.

News October 27, 2025

వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా..!

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో సోమవారం మిర్చి బస్తాలు భారీగా తరలివచ్చినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు రూ.16 వేలు, వండర్ హాట్ (WH) మిర్చి రూ.16,600 పలికింది. అలాగే తేజ మిర్చి ధర రూ.14,100, దీపిక మిర్చి రూ.15 వేలు పలికింది. మక్కలు(బిల్టీ)కి రూ.2050 ధర వచ్చింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

News October 27, 2025

డీసీసీ పీఠం పర్వతగిరికి దక్కేనా..?

image

జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠం పర్వతగిరికి దక్కుతుందా? అని శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. డీసీసీ అధ్యక్ష పదవికి ఎంపిక ప్రక్రియను అధిష్ఠానం ప్రారంభించిన నేపథ్యంలో పర్వతగిరి మండలం నుంచి ఇరువురు వ్యక్తుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఏనుగల్లు గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ కన్వీనర్ బొంపెల్లి దేవేందర్ రావు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు ఉన్నారు.