News July 28, 2024

BRS ప్రభుత్వం 2 నెలలు పింఛన్లు ఎగ్గొట్టింది: డిప్యూటీ సీఎం భట్టి

image

BRS ప్రభుత్వం 2 నెలలు ఆసరా పింఛన్లు ఎగ్గొట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘ORRపై 30 ఏళ్లపాటు వచ్చే ఆదాయాన్ని ఒక్క ఏడాదిలోనే తీసుకున్నారు. ప్రభుత్వం దిగిపోయే ముందు ఓఆర్ఆర్ వేలం వేసుకుని భవిష్యత్లో ఆదాయం లేకుండా చేశారు. పదేళ్లుగా టీచర్లకు పదోన్నతులు, బదిలీలు లేవు. ఈ ప్రభుత్వం 16 వేల మంది టీచర్లకు పదోన్నతులు, బదిలీలు కల్పించింది’ అని అన్నారు.

Similar News

News July 10, 2025

ఖమ్మం: సీఎంఆర్ రిక‘వర్రీ’

image

జిల్లాలోని 66 మిల్లర్లు ప్రభుత్వానికి సకాలంలో సీఎంఆర్ బియ్యంను అందించడంలో విఫలమవుతున్నారు. 2024-25 యాసంగి సీజన్‌లో ఇప్పటివరకు ప్రభుత్వానికి 60% మాత్రమే అందించారు. ఈ సీజన్లో 4,55,981,360 మె.ట ధాన్యాన్ని మిల్లర్లకు ఇవ్వగా, 1,84,444,836 మె.ట బియ్యంను అప్పగించారు. మరో 1,21,298,515 మె.ట అందజేయాల్సి ఉండగా.. ఈ ఏడాది SEPతో గడువు ముగియనుంది. పెండింగ్ సీఎంఆర్‌పై అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాలి.

News July 10, 2025

ఖమ్మంలో ఈ నెల 11న జాబ్ మేళా..!

image

ఖమ్మం టేకులపల్లి ప్రభుత్వ ఐటిఐ మోడల్ కెరీర్ సెంటర్ నందు ఈనెల 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఖాళీగా ఉన్న 25 పోస్టుల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎంపికైన వారికి రూ.20 వేలు నుంచి రూ.50 వేల వరకు వేతనం ఉంటుందన్నారు. డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు 11 గంటలకు జరిగే మేళాలో పాల్గొనాలని సూచించారు.

News July 10, 2025

రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు: ఖమ్మం DAO

image

జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడా కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి D.పుల్లయ్య తెలిపారు. బుధవారం సత్తుపల్లి రామానగరంలోని పలు ఎరువుల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల డీలర్లు MRPకి మించి అధిక ధరలకు విక్రయించొద్దని హెచ్చరించారు. ఒక ఎరువు కొంటే మరొకటి కొనమని రైతులను ఒత్తిడి చేయవద్దని సూచించారు.