News March 22, 2024
BRS మాజీ నేతలకే కాంగ్రెస్ MP టికెట్.. గెలుపెవరిది..?

HYD, RRలో రాజకీయం రసవత్తరంగా మారింది. మల్కాజిగిరి నుంచి వికారాబాద్ జడ్పీ ఛైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, చేవెళ్ల నుంచి ఎంపీ రంజిత్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇటీవల అధికార పార్టీలోకి చేరగా వీరికే అధిష్ఠానం MP టికెట్లు ఇచ్చింది. వీరిలో గెలిచేది ఎవరు.. మీ కామెంట్..?
Similar News
News April 24, 2025
బల్కంపేట ఎల్లమ్మ గుడి సంపులో పడి వ్యక్తి మృతి

బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి వచ్చిన ఓ వ్యక్తి సంపులో పడి మృతిచెందాడు. కాచిగూడకు చెందిన బి.బాలాజీ (48) కుటుంబ సభ్యులతో కలిసి ఎల్లమ్మ ఆలయానికి వచ్చాడు. అక్కడ నీటి సంపులో ఫోన్ పడిపోయింది. ఫోన్ తీసేందుకు యత్నించి సంపులో పడిపోయాడు. సిబ్బంది నిచ్చెన సాయంతో బాలాజీని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
News April 24, 2025
HYD: కాంగ్రెస్ పరిశీలకులు వీరే

కాంగ్రెస్ బుధవారం పరిశీలకులను నియమించింది. HYD, మేడ్చల్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, రంగారెడ్డికి సంబంధించి ఈ నియామకాలు జరిగాయి. HYDకు సురేశ్ కుమార్, సుబ్రహ్మణ్యప్రసాద్, ఖైరతాబాద్కు వినోద్ కుమార్, భీమగాని సౌజన్యగౌడ్, సికింద్రాబాద్కు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, సిద్దేశ్వర్, రంగారెడ్డికి శివసేనారెడ్డి, సంతోష్ కుమార్, దారాసింగ్, మేడ్చల్కు పారిజాత నర్సింహారెడ్డి, కె.శివకుమార్లను నియమించింది.
News April 24, 2025
HYD: ఎండలు మండుతున్నాయ్.. 27 వరకు జాగ్రత్త!

HYD, RR, MDCL జిల్లాల పరిధిలో ఎండ 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతను దాటేసింది. ఇబ్రహీంపట్నం, MCపల్లి, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో నిన్న 40-42 డిగ్రీలవరకు నమోదైంది. 27వ తేదీ వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని TGDPS తెలిపింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 నుంచి సా.4 గంటల వరకు బయటకు రాకుండా ఉండటం మంచిదని IAS అరవింద్ కుమార్ సూచించారు. గొడుగులు, టోపీలు వాడటంతో పాటు అధికంగా పానీయాలు తాగాలన్నారు.