News April 12, 2025
BRS రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలిరండి: మాజీ ఎమ్మెల్యే

హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి సమీపంలో BRS రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలి రావాలని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. రజాతోత్సవ సభకు సంబంధించిన పోస్టర్లను మాజీ ఎమ్మెల్యే ఆవిష్కరించారు. నీళ్లు,నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా 25 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి కేసీఆర్ ఆధ్వర్యంలో స్వరాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటాలు చేసిందన్నారు.
Similar News
News November 28, 2025
HYD: అభివృద్ధికి నిదర్శనంగా ఆదిబట్ల !

ఆదిబట్ల మున్సిపాలిటీ హైదరాబాద్ అభివృద్ధికి నిదర్శనంగా మారింది. ఒకప్పుడు కుగ్రామంగా ఉన్న ఆదిభట్ల మున్సిపాలిటీ ప్రస్తుతం మినీ గచ్చిబౌలిగా పేరుగాంచింది. IT సంస్థలు, రియల్ ఎస్టేట్ రంగాలకు నిలయంగా ఉంది. మాజీ సీఎం YS రాజశేఖర్ రెడ్డితో ఆదిభట్లకు ప్రాధాన్యం పెరిగింది. ఆయన హయాంలోనే ప్రతిష్టాత్మకమైన టాటా సంస్థను ఇక్కడికి తీసుకొచ్చారు. కాగా, అప్పటి ఆదిత్యనగర్ కాస్త కాలక్రమంగా ఆదిభట్లగా పేరు పొందింది.
News November 28, 2025
మదనపల్లె: తగ్గు ముఖం పడుతున్న టమాటా ధరలు

మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయి. మార్కెట్కు శుక్రవారం 180 మెట్రిక్ టన్నుల పంట వచ్చినట్లు మార్కెట్ సెక్రటరీ జగదీశ్ తెలిపారు. వాటిలో మొదటి రకం టమాటాలు 10 కిలోలు రూ.480 పలకగా రెండో రకం రూ. 450, మూడో రకం రూ.400 వరకు వ్యాపారులు కొనుగోలు చేశారన్నారు.
News November 28, 2025
రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోంది: పవన్

AP: కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తోందని Dy.CM పవన్ చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతగానో సహకరిస్తోందని తెలిపారు. అమరావతిలో బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధాన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా కార్యాలయాలు ఒకేచోట ఉండటం వల్ల వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలు వేగంగా సాగుతాయన్నారు. ఇవాళ్టి కార్యక్రమం భవనాలకే కాకుండా ఏపీ భవిష్యత్తుకు పడిన పునాది అని పేర్కొన్నారు.


