News April 5, 2025

BRS రజతోత్సవ సభ.. పాలమూరు నేతలతో KCR MEETING

image

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఈరోజు ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు ఖమ్మం, నల్గొండ జిల్లాల ముఖ్యనేతలతో పార్టీ అధినేత కే.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, జైపాల్ యాదవ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News April 9, 2025

KNR పోలీసులు GREAT.. తండ్రి, పిల్లలను కాపాడారు!

image

కుటుంబ కలహాలతో ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్తున్న తండ్రిని కాపాడినట్లు కరీంనగర్ 2వ టౌన్ పోలీసులు తెలిపారు. విద్యానగర్‌కు చెందిన దశరథ్ అనే వ్యక్తి కుటుంబ కలహాలతో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు 2 టౌన్ పోలీసులను ఆశ్రయించడంతో మొబైల్ ఫోన్ ఆధారంగా ట్రై చేసి దశరథ్ అతని ఇద్దరి పిల్లలను క్షేమంగా అప్పజెప్పారు.

News April 9, 2025

రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్.. రేపటి నుంచే

image

TG: రిజిస్ట్రేషన్ల కోసం గంటలకొద్దీ వెయిట్ చేయకుండా, దళారుల ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. రేపటి నుంచి ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ ప్రక్రియను అమలు చేయనుంది. రోజుకు 48 స్లాట్‌ల చొప్పున అందుబాటులో ఉంటాయి. ఇంటి నుంచే registration.telangana.gov.inలో స్లాట్ బుక్ చేసుకుని వెళితే 10-15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.

News April 9, 2025

మల్దకల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

image

మల్దకల్ మండలం అమరవాయి సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. అమరవాయికి చెందిన రాజు బైక్‌పై గద్వాల నుంచి గ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజుకు తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. చికిత్స కోసం 108లో గద్వాల ఆసుపత్రికి తరలించారు.

error: Content is protected !!