News May 3, 2024

BRS లేకుండా చేయాలని కాంగ్రెస్, బీజేపీ కుట్ర: హరీశ్ రావు

image

కాంగ్రెస్, బీజెపీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని బీఆర్ఎస్‌ను లేకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నారని ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలో చెరో 8 ఎంపీ స్థానాలను పంచుకొని బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. BJP పదేళ్ల పాలన, కాంగ్రెస్ 5 నెలల పాలనపై మాట్లాడకుండా మతం, రిజర్వేషన్ల పేరిట సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.

Similar News

News December 18, 2025

మెదక్ జిల్లాలో మొత్తం పోలింగ్ 89.30 %

image

మెదక్ జిల్లాలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 89.30 % పోలింగ్ నమోదైంది. 21 మండలాలు, 492 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా.. మొత్తం 4,98,152 మంది ఓటర్లకు 4,44,842 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 2,39,339లో 2,15,602 మంది, మహిళలు 2,58,806లో 2,29,235 మంది, ఇతరులు ఏడుగురిలో 5 మంది ఓటు వేశారు.

News December 18, 2025

చేగుంట: ట్రాక్టర్ కిందపడి యువకుడి మృతి

image

పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేగుంట మండలం కరీంనగర్ గ్రామానికి చెందిన మహమ్మద్ అక్బర్ గత నెల 29న ఈ ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో గురువారం మరణించాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News December 18, 2025

‘టెన్త్ పరీక్షల్లో 100% ఫలితాలు సాధించాలి’

image

STUTS మెదక్ జిల్లా 2026 నూతన సంవత్సర క్యాలండర్‌ను అదనపు కలెక్టర్ నగేష్ ఆవిష్కరించారు. జిల్లా విద్యాధికారి విజయ, జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నరేష్ పాల్గొన్నారు. అదనపు కలెక్టర్మా ట్లాడుతూ.. STUTS సంఘ బాధ్యులు పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో సహకరించడం అభినందనీయమన్నారు. టెన్త్ పరీక్షల్లో 100% ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాధికారి విజయ అన్నారు.