News December 21, 2025
BRS ఆధ్వర్యంలో జల సాధన ఉద్యమం?

తెలంగాణ రాష్ట్రంలో మరో జల సాధన ఉద్యమం తప్పదని మాజీ సీఎం KCR భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులను తగ్గిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని BRS ఆరోపిస్తోంది. ఇవాళ్టి పార్టీ కార్యవర్గ సమావేశంలో వారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు దీనిపై దిశానిర్ధేశం చేయనున్నట్లు సమాచారం.
Similar News
News December 24, 2025
20 లక్షల ఉద్యోగాల కల్పనకే ప్రాధాన్యం: CM

AP: మెరుగైన సేవలు వేగంగా అందించేందుకు ప్రభుత్వ శాఖలు ఇండికేటర్లను సిద్ధం చేసుకోవాలని CM చంద్రబాబు ఆదేశించారు. స్వర్ణాంధ్ర-2047, 10 సూత్రాల అమలుపై నోడల్ అధికారులతో సమీక్షించారు. ’20లక్షల ఉద్యోగాల కల్పనే మొదటి ప్రాధాన్యంగా పని చేయాలి. 10 సూత్రాల అంశాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలి. కీలక మిషన్గా నీటి భద్రత అంశంపై దృష్టి పెట్టాలి. కరవు అన్న మాట లేకుండా వరద నీటి నిర్వహణ జరగాలి’ అని సూచించారు.
News December 24, 2025
ఓటుకు నోటు దొంగ నువ్వు.. అదే నీ స్థాయి: KTR

TG: CM <<18660662>>రేవంత్ స్పీచ్<<>>పై KTR అంతే ఘాటుగా స్పందించారు. ‘పాలమూరు ప్రాజెక్టు గొంతుకోసి సొంత జిల్లానే దగా చేస్తున్నది చాలక దగుల్బాజీ కూతలు కూస్తున్నావా? రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలేని కోవర్ట్ బతుకు నీది. నీటి హక్కులపై రాజీపడ్డ నీ నిర్వాకాన్ని బయటపెడితే తట్టుకోలేక చిల్లర డైలాగులతో చిందులు తొక్కుతున్నావు. పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిపోయిన ఓటుకు నోటు దొంగవు నువ్వు.. అదే నీ స్థాయి’ అని ట్వీట్ చేశారు.
News December 24, 2025
‘ఐయామ్ సారీ అమ్మా’.. డిగ్రీ విద్యార్థిని సూసైడ్

TG: ఏడేళ్ల క్రితం తండ్రి మరణం, తాజాగా తల్లికి అనారోగ్యం.. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో ఖమ్మం(D) కవిరాజు నగర్లో విద్యార్థిని సృజన(18) సూసైడ్ చేసుకుంది. అనారోగ్యానికి గురైన అమ్మ బతకడం కష్టమని వైద్యులు చెప్పారు. భవిష్యత్తుపై బెంగతో మానసికంగా కుంగిపోయిన యువతి ‘ఐయామ్ సారీ అమ్మా’ అంటూ ఫొటోపై నోట్ రాసి నిన్న అఘాయిత్యానికి పాల్పడింది. ఈ హృదయవిదారక ఘటన స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.


