News October 20, 2024

నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు

image

TG: రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా BRS ఆందోళనలు చేపట్టనుంది. మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతు బంధును ఎత్తివేసే కుట్రలో భాగంగానే రైతు భరోసా పేరుతో క్యాబినెట్ సబ్ కమిటీ, కొత్త గైడ్‌లైన్స్ అంటూ డ్రామా చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్‌కు రైతుల ఉసురు తగులుతుందని దుయ్యబట్టారు.

Similar News

News October 20, 2024

ఫార్మసీ సీట్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్

image

AP: రాష్ట్రంలో బీ ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. దీంతో ఫార్మసీ విద్యా సంస్థల్లో సీట్ల భర్తీకి ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 92 విద్యాసంస్థల్లో సీట్లను భర్తీ చేసేందుకు సాంకేతిక విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేయనుంది. కాగా రాష్ట్రంలో సుమారు 12 వేల ఫార్మా సీట్లు అందుబాటులో ఉన్నాయి.

News October 20, 2024

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి వారి దర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. 5 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 80,741 మంది భక్తులు దర్శించుకోగా, 31,581 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు సమకూరింది.

News October 20, 2024

TG: గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లు ఇవే

image

☞ జీవో 29 రద్దు చేయాలి, పోస్టుల సంఖ్యను పెంచాలి
☞ మెయిన్స్ రీషెడ్యూల్ చేయాలి
☞ ప్రిలిమ్స్ ఫలితాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలి
☞ ప్రామాణిక పుస్తకాలపై స్పష్టత ఇవ్వాలి
☞ కోర్టు కేసులు క్లియర్ చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలి
☞ పరీక్షలు పూర్తయి, భర్తీ ప్రక్రియ వరకూ ఒకే హాల్‌టికెట్ నంబర్ ఉండాలి
☞ HYDతో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాల్లోనూ పరీక్షలు నిర్వహించాలి