News April 6, 2024

అసెంబ్లీ సమన్వయకర్తలను నియమించిన BRS

image

TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అసెంబ్లీ స్థానాల వారీగా సమన్వయకర్తలను నియమించింది. మేడ్చల్-శంబీపూర్ రాజు, మల్కాజిగిరి-నందికంటి శ్రీధర్, కుత్బుల్లాపూర్-గొట్టిముక్కల వెంగళరావు, కూకట్‌పల్లి-బేతిరెడ్డి సుభాశ్ రెడ్డి, ఉప్పల్-జహంగీర్ పాషా, కంటోన్మెంట్-రావుల శ్రీధర్ రెడ్డిని నియమించింది.

Similar News

News January 13, 2026

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పబ్లిక్ టాక్

image

రవితేజ-కిశోర్ తిరుమల కాంబోలో రూపొందిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం ఇవాళ రిలీజైంది. విదేశాల్లో ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు తమ అనుభవాలను SM వేదికగా పంచుకుంటున్నారు. ‘స్టోరీ, స్క్రీన్ ప్లే రొటీన్‌లా అనిపించినా ఫస్ట్ హాఫ్‌లో కామెడీ మెప్పిస్తుంది. పాటలు ఆకట్టుకుంటాయి. కొన్ని సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపిస్తాయి’ అని కామెంట్స్ చేస్తున్నారు. కాసేపట్లో Way2Newsలో మూవీ రివ్యూ&రేటింగ్.

News January 13, 2026

స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ వాయిదా

image

AP: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 17వ తేదీ జరగాల్సిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర ప్రోగ్రాం వాయిదా పడింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పండుగ వేళ ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబాలతో కలిసి ఉంటారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి నెలా మూడో శనివారం జరగాల్సిన కార్యక్రమాన్ని జనవరిలో నాలుగో శనివారం నిర్వహించనున్నారు.

News January 13, 2026

నిమ్మకు డ్రిప్ విధానంలో నీరు అందిస్తే మేలు

image

నిమ్మలో పూత, పిందె, పండు అభివృద్ధి దశలో తప్పనిసరిగా నీరు అందించకుంటే దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. నిమ్మ తోటలకు డ్రిప్ ద్వారా నీరు అందించడం మంచిదంటున్నారు నిపుణులు. దీని వల్ల 14-25% వరకు నీరు ఆదా అవడంతో పాటు కలుపు 30% తగ్గుతుంది. నీటిలో తేమ ఎక్కువ రోజులుండి కాయ నాణ్యత, దిగుబడి పెరిగి తెగుళ్ల వ్యాప్తి తగ్గుతుంది. ఎరువులను కూడా డ్రిప్ విధానంలో అందించవచ్చు. దీని వల్ల కూలీల ఖర్చును తగ్గించుకోవచ్చు.