News February 9, 2025
నేడు బీఆర్ఎస్ ‘బీసీ’ సమావేశం

TG: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం పోరాడాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణపై ఇవాళ బీసీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కేటీఆర్ ‘బీసీ’ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్లో జరిగే ఈ భేటీలో కులగణన సర్వే నివేదిక, 42% రిజర్వేషన్ అమలుతో పాటు ఇతర సమస్యలపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
Similar News
News February 18, 2026
ప్రకృతి వ్యవసాయంలో APCNF కీలక పాత్ర

రైతులను రసాయన రహిత వ్యవసాయంవైపు నడిపించాలనే ఉద్దేశంతో 2016లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం APCNF(Andhra Pradesh Community Managed Natural Farming) ప్రోగ్రామ్ ప్రారంభించింది. దీని కింద సన్నకారు రైతులు రసాయన సేద్యం కాకుండా సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేసేలా రైతు సాధికార సంస్థ కృషి చేస్తోంది. రాష్ట్రంలో వేలాది మంది రైతులు లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తూ మానవ ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు.
News February 18, 2026
NBCC 59పోస్టులకు నోటిఫికేషన్

నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (<
News February 18, 2026
ఏప్రిల్ 19 నుంచి చార్ధామ్ యాత్ర.. రిజిస్ట్రేషన్కు ఫీజు!

పవిత్ర చార్ధామ్ యాత్ర ఏప్రిల్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది రిజిస్ట్రేషన్కు మినిమమ్ ఫీజు వసూలు చేయనున్నారు. ఫేక్ రిజిస్ట్రేషన్లను నిరోధించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకట్రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఫీజు ఎంతనేది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. ఏప్రిల్ 19న గంగోత్రి, యమునోత్రి, 22న కేదార్నాథ్, 23న బద్రీనాథ్ తెరుచుకోనున్నాయి.


