News August 22, 2024

నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ధర్నా

image

TG: రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.2లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ BRS నేడు రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేయనుంది. రైతులకు అండగా నిలిచేందుకు ఈ కార్యాచరణకు పిలుపునిచ్చింది. రుణమాఫీకి బడ్జెట్లో రూ.31వేల కోట్లకు ఆమోదం తెలిపి, రూ.18వేల కోట్లే ఖర్చు చేసిన విషయాన్ని రైతులకు వివరించాలని కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆంక్షలతో రైతులను మోసం చేసినందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Similar News

News July 10, 2025

నిమిషకు ఉరిశిక్ష.. సుప్రీంకోర్టులో పిటిషన్

image

కేరళ నర్సు <<17009348>>నిమిష<<>> ప్రియ కేసులో కేంద్రం జోక్యం చేసుకోవాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 14కు విచారణను వాయిదా వేసింది. ఈ కేసులో భారత ప్రభుత్వం దౌత్యపరమైన జోక్యం చేసుకోవాలని పిటిషనర్ కోరారు. కాగా వ్యాపారి హత్య కేసులో యెమెన్ ప్రభుత్వం నిమిషకు ఈ నెల 16న మరణశిక్ష అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అటు కేంద్రం కూడా ఈ విషయంలో ఆమెను కాపాడాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

News July 10, 2025

HCAలో అక్రమాలు.. ముగ్గురిపై కేసు నమోదు

image

HYD క్రికెట్ అసోసియేషన్‌(HCA)లో నిధుల దుర్వినియోగంపై CID దర్యాప్తు జరుపుతోంది. అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కోశాధికారి శ్రీనివాస రావు, CEO సునీల్‌పై కేసు నమోదు చేసింది. వీరితో పాటు శ్రీచక్ర క్రికెట్ క్లబ్‌కు చెందిన రాజేందర్, కవితను అదుపులోకి తీసుకుంది. సంతకాల ఫోర్జరీ, నకిలీ దస్త్రాలు సృష్టించడంపై విచారిస్తోంది. కాగా SRHను బెదిరించిన కేసులో నిన్న జగన్మోహన్‌ <<17008940>>అరెస్ట్<<>> అయిన సంగతి తెలిసిందే.

News July 10, 2025

పూజారి అసభ్యంగా తాకాడు: నటి

image

మలేషియాలోని ఆలయంలో పూజారి తనను వేధించినట్లు భారత సంతతి నటి లిశల్లిని కనరన్‌ను ఆరోపించారు. గత నెల 21న సెపంగ్‌లోని మరియమ్మన్ టెంపుల్‌లో ఈ ఘటన జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. పూజారి తనను అసభ్యంగా ఛాతీపై తాకుతూ భారత్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలం అంటూ నీటిని తనపై పోశాడని ఆమె ఇన్‌స్టాలో ఆరోపించారు. దీనిపై ఈ నెల 4న మలేషియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూజారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.