News February 5, 2025

ఈ నెల 10న కొడంగల్‌లో BRS రైతు దీక్ష

image

TG: సీఎం రేవంత్ సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ఈ నెల 10న బీఆర్ఎస్ రైతు దీక్ష చేపట్టనుంది. కోస్గిలో జరిగే ఈ దీక్షలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష నిర్వహించనుంది.

Similar News

News October 14, 2025

MCTEలో 18 పోస్టులు

image

క్యాడెట్స్ ట్రైనింగ్ వింగ్ ఆఫ్ మిలటరీ కాలేజీ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (MCTE)18 అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈ, ఎంఎస్, MSc, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈనెల 31 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.

News October 14, 2025

రోజూ ఓంకారం జపిస్తే..?

image

శివుడి దివ్య సందేశం ప్రకారం.. శివుడి ధ్యానాన్ని విడవడమే మానవులలో అజ్ఞానం ప్రవేశించడానికి కారణం. నిజమైన జ్ఞానంతో ఉంటే మనుషులు కూడా శివుడితో సమానమైన సారూప్యాన్ని పొందే అవకాశం ఉండేది. అందుకే, అహంకారాన్ని నిర్మూలించి, జ్ఞానసిద్ధి పొందడానికి ఓంకారాన్ని జపించాలని శివుడు ఉపదేశించాడు. శివుడి ముఖం నుంచే జనించిన ఈ సర్వ మంగళప్రదమైన ఓంకారాన్ని నిత్యం స్మరిస్తే, శివుడిని స్మరించినట్లే అవుతుంది. <<-se>>#SIVOHAM<<>>

News October 14, 2025

తిరుమల: 23 కంపార్టుమెంట్లలో భక్తులు

image

AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు వేంకటేశ్వర స్వామి దర్శనానికి 12గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామిని 78,569 మంది భక్తులు దర్శించుకోగా.. 27,482 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.93కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.