News November 25, 2024
BRS వాళ్లకు మెదడు కూడా పోయింది: రేవంత్

TG: అదానీ సంస్థకు తెలంగాణలో భారీ సంఖ్యలో ప్రాజెక్టులు ఇచ్చి BRS కమీషన్లు మెక్కిందని CM రేవంత్ ఆరోపించారు. ‘నేనేం చేశాను? CSR ఫండ్స్ నుంచి నిరుద్యోగ యువత, స్కిల్ వర్సిటీ కోసం రూ.100 కోట్లు తీసుకొచ్చా. మా కుటుంబం ఆ నిధులు కొట్టేయలేదు. KCR, KTR గతంలో అదానీని కలిసి వంగి వంగి నమస్కారాలు పెట్టారు. BRS నేతలకు గతేడాది అధికారం, ఆ తర్వాత డిపాజిట్లు పోయాయి. ఇప్పుడు మెదడూ పోయింది’ అని ఎద్దేవా చేశారు.
Similar News
News January 3, 2026
వెనిజులా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకున్నాం: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘వెనిజులాలో భారీ పేలుళ్లకు పాల్పడింది మేమే. <<18750335>>ప్రెసిడెంట్ <<>>నికోలస్ మధురో, ఆయన భార్య ఇప్పుడు మా అదుపులో ఉన్నారు. US లా ఎన్ఫోర్స్మెంట్ ఈ లార్జ్ స్కేల్ ఆపరేషన్ చేపట్టింది. ఈ అంశంపై ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నాం. ఇంటర్నేషనల్ డ్రగ్స్ కేంద్రంగా వెనిజులా మారింది’ అని ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు.
News January 3, 2026
ECGతో గుండెపోటును ముందే గుర్తించలేం: వైద్యులు

ఈసీజీ రిపోర్ట్ నార్మల్గా ఉన్నంత మాత్రాన గుండెపోటు ముప్పు లేదని నిర్ధారించలేమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ECG కేవలం ఆ క్షణంలో గుండె స్థితిని మాత్రమే చూపిస్తుంది. గుండెపోటుకు కొన్ని గంటల ముందు తీసిన ECG కూడా చాలా మందిలో నార్మల్గా వచ్చే అవకాశం ఉంది. రక్తనాళాల్లో పూడికలు(Plaque) ఎప్పుడు పగిలి గుండెపోటు వస్తుందో ముందే ఊహించలేదు. నిర్లక్ష్యం చేయకుండా ఇతర పరీక్షలు చేయించుకోవాలి’ అని సూచిస్తున్నారు.
News January 3, 2026
BRS సభకు ఎందుకు రావడం లేదో చెప్పాలి.. శ్రీధర్ బాబు డిమాండ్

TG: అసెంబ్లీ సమావేశాలంటే బీఆర్ఎస్కు చులకనని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. కీలక ప్రాజెక్టులపై చర్చ జరుగుతుంటే ఎందుకు రావడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు.


