News July 23, 2024

ఈ నెల 25న మేడిగడ్డకు బీఆర్ఎస్ నేతలు

image

ఈ నెల 25న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరం కలసి మేడిగడ్డ పర్యటనకు వెళ్తామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. 26న మేడిగడ్డ, కన్నెపల్లి పంప్ హౌజ్‌ను సందర్శిస్తామని తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో చెప్పారు. లక్షల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయడం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్, BJPని చెరో ఎనిమిది సీట్లలో గెలిపిస్తే రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చారని విమర్శించారు.

Similar News

News March 26, 2026

శ్రీరామ నవమి రోజున ఏం చేయాలంటే?

image

రేపే శ్రీరామ నవమి. వేకువజామునే నిద్రలేచి ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకోవాలి. మంగళ స్నానాలు ఆచరించి, ఇంటిని మామిడి తోరణాలు, ముంగిట రంగవల్లికలతో అలంకరించుకోవాలి. సీతారాముల పటాలకు పూజ చేసి.. బెల్లం పానకం, వడపప్పును నైవేద్యంగా సమర్పించాలి. వీలైతే సమీపంలోని రామాలయానికి వెళ్లి సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొనాలి. రామనామ స్మరణతో ఈ రోజంతా గడపడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

News March 26, 2026

అమరావతికి చట్టబద్ధత కల్పించేలా తీర్మానం

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన క్యాబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది.
➤ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేలా తీర్మానం
➤ మైనింగ్ లీజులను వడ్డెర సొసైటీలకు కేటాయించేందుకు క్యాబినెట్ ఆమోదం
➤ ఖనిజ లీజుల కేటాయింపులో ప్రీమియం, సీనరేజ్ ఫీజుల్లో 50% రాయితీ
➤ 96 jr., sr. సివిల్ జడ్జిల కోర్టుల ఏర్పాటుకు ఆమోదం
➤ 2025-26 ఏడాదిలో ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ

News March 26, 2026

నియోజకవర్గాలు 50శాతం పెరుగుతాయి: చంద్రబాబు

image

నియోజకవర్గాల పునర్విభజనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. 2029 ఎన్నికల నాటికి రాష్ట్రంలో 50శాతం నియోజకవర్గాలు పెరుగుతాయన్నారు. దీని ద్వారా ఎక్కువ మందికి రాజకీయ అవకాశాలు వస్తాయని చెప్పారు. నియోజకవర్గాల పెంపు వల్ల పరిపాలనా సౌలభ్యం పెరుగుతుందని, దీనిపై ప్రజలకు ఇప్పటి నుంచే అవగాహన కల్పించాలని మంత్రులకు సూచించారు.