News September 1, 2024
ప్లీనరీపై బీఆర్ఎస్ అధిష్ఠానం దృష్టి

పార్టీ ప్లీనరీ నిర్వహణపై BRS నాయకత్వం దృష్టిసారించినట్టు తెలుస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అంతకంటే ముందే ప్లీనరీ నిర్వహించాలనే యోచనలో మాజీ సీఎం కేసీఆర్ ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలతో డీలా పడిన క్యాడర్లో ఉత్సాహం నింపేలా HYD బయట ప్లీనరీ నిర్వహించాలనే యోచనలో BRS ఉన్నట్టు సమాచారం.
Similar News
News November 27, 2025
NIT వరంగల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

<
News November 27, 2025
పంచాయతీ ఎన్నికలు.. జీవో నం.46 అంటే ఏంటి?

TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 22న జీవో నం.46ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి గరిష్ఠంగా 50 శాతం మించకూడదు. దీని ప్రకారం బీసీలకు 22% రిజర్వేషన్లు మాత్రమే దక్కుతాయని బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీవోను <<18402975>>సవాల్ చేస్తూ హైకోర్టులో<<>> పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణ జరగనుంది.
News November 27, 2025
పవిత్ర పంబా నది విశేషాలు మీకు తెలుసా?

పంబా నది ప్రస్తావన త్రేతాయుగం నుంచి ఉంది. అందుకే పవిత్ర నదిగా దీన్ని పరిగణిస్తారు. ఇది ఔషధ మూలికల సారంతో ప్రవహిస్తుందని నమ్ముతారు. ఈ నదిలో స్నానం చేస్తే వన యాత్ర అలసట మాయమవుతుందట. యాత్రలో భాగంగా స్వాములు ఇక్కడ స్నానమచారిస్తుంటారు. ఇక్కడ పితృకర్మలు నిర్వహిస్తే 7 తరాల వారికి మోక్షం లభిస్తుందని చెబుతారు. ఇక్కడ కొలువైన కన్నెమూల మహా గణపతిని దర్శించి యాత్రను కొనసాగిస్తారు. <<-se>>#AyyappaMala<<>>


