News March 11, 2025
నేడు బీఆర్ఎస్ శాసనసభాపక్షం భేటీ

TG: తెలంగాణ భవన్లో KCR అధ్యక్షతన ఇవాళ BRS శాసనసభాపక్షం భేటీ కానుంది. బడ్జెట్ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ప్రజాప్రతినిధులకు KCR దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లడంపై మార్గనిర్దేశం చేయనున్నారు. బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 17 లేదా 19న ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Similar News
News March 12, 2025
ఇండియాకు రూ.20.80 కోట్లు.. పాక్కి ఎంతంటే?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచిన భారత జట్టుకు ICC రూ.20.80 కోట్లు ప్రైజ్ మనీగా ఇచ్చింది. ఇక రన్నరప్గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు రూ.10.40 కోట్లు చెల్లించింది. కాగా, సెమీస్లో ఓడిపోయిన ఆస్ట్రేలియా& సౌతాఫ్రికా జట్లకు రూ.5.20కోట్లు, 5, 6 స్థానాల్లో నిలిచిన అఫ్గాన్ & బంగ్లాదేశ్లకు రూ.3 కోట్లు, ఇక చివరి రెండు స్థానాల్లో ఉన్న పాకిస్థాన్ & ఇంగ్లండ్ టీమ్స్కు రూ.1.20 కోట్లు అందించింది.
News March 12, 2025
సాగునీటి నిర్వహణలో ప్రభుత్వం విఫలం: KCR

TG: కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిపడా సమయం ఇచ్చామని, మూడో వంతు సమయం పూర్తైందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. సాగునీటి నిర్వహణ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. దళితబంధు నిలిపివేయడం, గొర్రెల పెంపకం, చేపల పంపిణీపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ ప్రజాప్రతినిధులకు స్పష్టం చేశారు.
News March 12, 2025
మహేశ్ బాబు-రాజమౌళి సినిమా కథ ఇదేనా?

మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో రానున్న సినిమా గురించి బాలీవుడ్ పోర్టల్ పింక్ విల్లా ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం.. ఈ మూవీ కథ కాశీ చరిత్రకు సంబంధించిందిగా ఉండనుంది. పురాణాలకు, నేటి కాలానికి ముడిపెడుతూ సినిమా సాగుతుంది. దీని కోసమే మూవీ టీమ్ హైదరాబాద్లో కాశీ సెట్ వేశారు. రామాయణంలో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చే ఘట్టం ఈ కథకు ప్రధాన స్ఫూర్తి అని తెలుస్తోంది.