News September 13, 2024

రేపు అరికెపూడి గాంధీ నివాసంలో బీఆర్ఎస్ భేటీ

image

TG: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంట్లో రేపు పార్టీ కీలక సమావేశం జరుగుతుందని బీఆర్ఎస్ ప్రకటించింది. తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానని గాంధీ వ్యాఖ్యానించడంతో బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నివాసం నుంచి గాంధీ ఇంటికి బయల్దేరి వెళ్లనున్నట్లు వెల్లడించింది. ఈ భేటీలో పాడి కౌశిక్ రెడ్డి కూడా పాల్గొంటారని తెలిపింది. కాగా కేశంపేట పీఎస్ నుంచి బీఆర్ఎస్ నేతలు విడుదలయ్యారు.

Similar News

News August 28, 2025

అమెరికా టారిఫ్స్.. భారత్ ప్లాన్ ఇదే!

image

అమెరికా 50% టారిఫ్స్ అమల్లోకి రావడంతో భారత్ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. ఎగుమతులను 40 దేశాలకు విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. యూకే, సౌత్ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాలకు డైమండ్స్, టెక్స్‌టైల్, లెదర్, సీ ఫుడ్ సహా ఇతర వస్తువులను ఎగుమతి చేయాలని భావిస్తోంది. భారత వస్తువుల క్వాలిటీ బాగుంటుందని, నమ్మకమైన ఎగుమతిదారు అని విదేశాల్లో విశ్వసనీయత ఉండటంతో దాన్ని వాడుకోవాలని యోచిస్తోంది.

News August 27, 2025

ఈ జిల్లాల్లో రేపు విద్యాసంస్థలకు సెలవు

image

TG: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించారు. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు రేపు సెలవు ఉండనుంది. మిగతా జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. మీ జిల్లాలో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.

News August 27, 2025

గోదావరి పరీవాహక ప్రజలు జాగ్రత్త!

image

TG: గోదావరి నదిపై నిజామాబాద్ జిల్లాలో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద భారీగా పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా అది 4 లక్షల నుంచి 5 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందన్నారు. మంజీరా నది వరద అంతా SRSPలోకి రానుంది. అటు కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సైతం ప్రవాహం పెరగనుంది.