News July 19, 2024
ప్రాంతీయ పార్టీల ఆదాయంలో BRS టాప్

దేశంలో ప్రాంతీయ పార్టీల ఆదాయంలో BRS అగ్రస్థానంలో నిలిచినట్లు ADR నివేదిక వెల్లడించింది. రూ.737 కోట్లతో టాప్లో కొనసాగుతోంది. ఆ తర్వాత టీఎంసీ (రూ.333 కోట్లు), డీఎంకే (రూ.214 కోట్లు), బీజేడీ (రూ.181 కోట్లు), వైసీపీ (రూ.74 కోట్లు), టీడీపీ (రూ.63 కోట్లు), ఎస్పీ (రూ.32 కోట్లు) ఉన్నాయి. అలాగే ఖర్చులో టీఎంసీ (రూ.181 కోట్లు) టాప్లో ఉంది. ఆ తర్వాత వైసీపీ (రూ.79 కోట్లు), బీఆర్ఎస్ (రూ.57 కోట్లు) నిలిచాయి.
Similar News
News October 14, 2025
తిరుమల: సీఐడీ విచారణ మొదలు

AP: HC ఆదేశాలతో తిరుమల ఆలయంలోని పరకామణి చోరీ కేసు విచారణను CID ప్రారంభించింది. పరకామణి, ఆపై చోరీ కేసు నమోదైన తిరుమల వన్టౌన్ PSలో రికార్డులను చెక్ చేసింది. CID డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ సాగుతోంది. 2023 MARలో 920డాలర్లు దొంగిలిస్తూ TTD ఉద్యోగి రవి పట్టుబడటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై TTD పూర్తిస్థాయి దర్యాప్తు చేయలేదని పిల్ దాఖలు కాగా హైకోర్టు విచారణకు ఆదేశించింది.
News October 14, 2025
వంటింటి చిట్కాలు

* అల్లం, వెల్లుల్లి పేస్ట్ చేసే ముందు వాటిని వేయిస్తే పేస్ట్ ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
* తేనెలో నాలుగైదు మిరియాలు వేస్తే చీమలు పట్టకుండా ఉంటాయి.
* చికెన్ ఉడికించేటప్పుడు ఒక కోడిగుడ్డు చేర్చడం వల్ల రుచి పెరుగుతుంది.
* కూరలు, గ్రేవీ మాడినట్లు గుర్తిస్తే వాటిలో వెన్న, పెరుగు కలిపితే వాసన రాకుండా ఉంటుంది.
<<-se>>#VantintiChitkalu<<>>
News October 14, 2025
1,064 కిలోల గుమ్మడికాయను పండించాడు

గుమ్మడికాయలు సాధారణంగా 3-5KGల బరువు ఉంటాయి. ఇంకా జాగ్రత్తగా పెంచితే 10-20KGల వరకు బరువు పెరగొచ్చు. కానీ కాలిఫోర్నియాలోని సాంట రోసాకు చెందిన బ్రాండన్ డ్వాసన్ ప్రత్యేక పద్ధతులతో 1,064 KGల గుమ్మడికాయను పండించారు. కాలిఫోర్నియాలో జరిగిన గుమ్మడికాయల ప్రదర్శన పోటీలో డ్వాసన్ విజేతగా నిలిచి 20 వేల డాలర్లు గెలుచుకున్నారు. ఇంజినీర్ అయిన డ్వాసన్ ఐదేళ్లుగా అతి పెద్ద గుమ్మడికాయలను సాగు చేస్తున్నారు.