News June 27, 2024
బీజేపీకి BRS ఓట్లు వేయించింది: CM రేవంత్

MP ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించేందుకు బీజేపీకి BRS ఓట్లు వేయించిందని CM రేవంత్ ఆరోపించారు. సిద్దిపేట, సిరిసిల్లలో బీజేపీకి ఎక్కువ ఓట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి కోసం తాము కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. BRSను బతికించేందుకు కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ఎంపీ ఎన్నికల్లో ఓడించినా KCRకు బుద్ధి రాలేదని రేవంత్ ఫైరయ్యారు.
Similar News
News October 18, 2025
వర్కింగ్ ఉమెన్స్.. ఒత్తిడి తగ్గాలంటే?

ఇంట్లో, ఆఫీసులో పనుల కారణంగా వర్కింగ్ ఉమెన్స్ ఎక్కువగా ఒత్తిడి గురవుతుంటారు. అలాంటివారు రోజూ మెడిటేషన్, వాకింగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘మీకు వచ్చినా, రాకపోయినా కాగితాలపై బొమ్మలు, పెయింటింగ్స్ వేయాలి. దీనివల్ల మీ ఫోకస్ పెరుగుతుంది. మీకు ఇష్టమైన ఆహారాన్ని తినాలి. మొబైల్ ఫోన్ పక్కనపెట్టి పిల్లలు, పెట్స్తో ఆడుకోవడం, మ్యూజిక్ వినడం స్ట్రెస్ తగ్గించడంలో మేలు చేస్తాయి’ అని పేర్కొంటున్నారు.
News October 18, 2025
నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 1,104 పోస్టులు

నార్త్ ఈస్టర్న్ రైల్వే 1,104 అప్రెంటిస్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ITI అర్హతగల అభ్యర్థులు NOV 15వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 15 -24 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి సడలింపు ఉంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.100. ST, SC, దివ్యాంగులకు మినహాయింపు కలదు. వెబ్సైట్: https://ner.indianrailways.gov.in/
మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 18, 2025
DA బకాయిలు వెంటనే చెల్లించాలి: ఉద్యోగ సంఘాలు

AP: ఉద్యోగ సంఘాలతో మంత్రుల సబ్ కమిటీ భేటీ ముగిసింది. అపరిష్కృతంగా ఉన్న డిమాండ్లను ఉద్యోగ నేతలు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. 4 DA బకాయిలు చెల్లించాలని, కొత్త PRC, పెన్షన్ సహ అనేక సమస్యలను మంత్రుల ముందుంచారు. వీటిలో కొన్నింటిపై కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ఈ అంశాలను CM దృష్టికి తీసుకువెళ్తామని, త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.