News June 27, 2024
బీజేపీకి BRS ఓట్లు వేయించింది: CM రేవంత్

MP ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించేందుకు బీజేపీకి BRS ఓట్లు వేయించిందని CM రేవంత్ ఆరోపించారు. సిద్దిపేట, సిరిసిల్లలో బీజేపీకి ఎక్కువ ఓట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి కోసం తాము కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. BRSను బతికించేందుకు కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ఎంపీ ఎన్నికల్లో ఓడించినా KCRకు బుద్ధి రాలేదని రేవంత్ ఫైరయ్యారు.
Similar News
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
News November 25, 2025
భర్తపై గృహ హింస కేసు పెట్టిన నటి

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్పై గృహహింస కేసు పెట్టారు. ఆయన నుంచి రూ.50Cr నష్టపరిహారం ఇప్పించాలన్నారు. నెలకు తనకు రూ.10 లక్షలు మెయింటెనెన్స్ చెల్లించేలా ఆదేశించాలని ముంబై కోర్టును కోరారు. అంతేకాకుండా ముంబైలోని తన నివాసంలోకి హాగ్ను ప్రవేశించకుండా ముగ్గురు పిల్లలను తానే చూసుకునే అనుమతివ్వాలన్నారు. దీంతో కోర్టు హాగ్కు నోటీసులు జారీ చేసింది. జైట్లీ, హాగ్ 2011లో పెళ్లి చేసుకున్నారు.


