News September 14, 2024

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టింది బీఆర్ఎస్సే: మంత్రి పొన్నం

image

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ <<14099367>>వ్యాఖ్యల<<>>కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చిగొట్టింది బీఆర్ఎస్ సభ్యులేనని మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఉండే సెటిలర్లను విమర్శించింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. ప్రాంతీయతను రాజకీయాల కోసం వాడుకోవాలని బీఆర్ఎస్ చూస్తోందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్‌లా నియంతృత్వ పోకడలకు తాము పోవడం లేదన్నారు.

Similar News

News October 21, 2025

తెలంగాణలో తగ్గిన పప్పు దినుసుల సాగు

image

TG: రాష్ట్రంలో ఈ ఏడాది పప్పు దినుసుల సాగు విస్తీర్ణం తగ్గింది. గత ఏడాది 8,25,236 ఎకరాల్లో పప్పు దినుసులను సాగు చేయగా.. ఈ ఏడాది 5,83,736 ఎకరాలకే పరిమితమైంది. వర్షాభావ పరిస్థితులు, ధరల్లో హెచ్చుతగ్గులు, మార్కెటింగ్ సమస్యలు, పంట రవాణా వ్యయం పెరుగుదల, నిల్వ వసతులలేమి కారణంగా ఈ పంటల సాగు విస్తీర్ణం తగ్గినట్లు తెలుస్తోంది. పప్పు దినుసుల్లో కందులు, పెసలు, మినుములను రాష్ట్రంలో ఎక్కువగా సాగు చేస్తున్నారు.

News October 21, 2025

ఆక్వా రైతులకు శుభవార్త చెప్పిన లోకేశ్

image

AP: ఆక్వా రైతులకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు. ఇప్పటివరకు తెల్లమచ్చ వైరస్ కారణంగా పొట్టు తీయని రొయ్యల ఎగుమతులపై ఆస్ట్రేలియా పరిమితులు విధించగా తాజాగా వాటిని ఎత్తివేసి ఎగుమతులకు అనుమతించిందని మంత్రి చెప్పారు. దీనికోసం కృషిచేసిన ఇండియా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు కొత్త మార్కెట్లకు విస్తరించాల్సిన అవసరముందని ఇది నిరూపిస్తోందని వివరించారు.

News October 21, 2025

తరింపజేసే పంచమహామంత్రాలు

image

మనః అంటే మనసు, త్ర అంటే రక్షించేది. మనసును రక్షించేదే మంత్రం. ఇది దైవస్వరూపం. మంత్రం ఉచ్చరించినపుడు అందులో నాదబలం మనసును శాంతపరచి, ఆత్మను ఉన్నతస్థితికి తీసుకెళ్తుంది. పంచమహామంత్రాలివే..
1.ఓంనమఃశివాయ- పంచాక్షరీమంత్రం 2.ఓం నమో నారాయణాయ-అష్టాక్షరీమంత్రం 3.ఓం నమో భగవతే వాసుదేవాయ-ద్వాదశాక్షరీ మంత్రం, 4.ఓంభూర్భువఃస్వహ-గాయత్రీ మంత్రం, 5.ఓంత్రయంబకం యజామహే-మహామృత్యుంజయ మంత్రం.