News February 19, 2025
దారుణం.. బాలికపై ఏడుగురు గ్యాంగ్ రేప్

తమిళనాడు కోయంబత్తూర్లో దారుణం జరిగింది. కునియముత్తూరులో 17 ఏళ్ల బాలికపై ఏడుగురు విద్యార్థులు గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. ఇంటర్ ఫెయిలై బామ్మ ఇంట్లో ఉంటున్న బాలికకు సోషల్ మీడియాలో ఓ కాలేజీ విద్యార్థితో పరిచయమైంది. ఆమెను నమ్మించి తన గదికి రప్పించుకున్న విద్యార్థి అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆరుగురు స్నేహితుల్ని ఆమెపైకి ఉసిగొల్పి పైశాచిక ఆనందం పొందాడు. నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
Similar News
News December 1, 2025
పానీపూరీ కోసం తెరిచిన నోరు మూసుకోలేదు

UP ఔరైయాలో వింత ఘటన జరిగింది. పానీపూరి తినబోయిన మహిళ దవడ డిస్లొకేట్ అయ్యింది. మేనకోడలు డెలివరీ కోసం ఇంకాలా దేవి ఆస్పత్రికి వెళ్లారు. పిల్లలతో కలిసి ఆవిడ కూడా పానీపూరీ తినేందుకు వెళ్లారు. అయితే ఓ పెద్ద పూరీ తినేందుకు ఆమె నోరు తెరవగా అది తిరిగి మూసుకోలేదు. చివరికి వైద్యులు చికిత్స చేసి దానిని సరి చేశారు. సడెన్గా, ఏదో పెద్ద ఫుడ్ ఐటమ్ తినేందుకు నోరు తెరవడంతో అలా అయ్యిందని చెప్పారు.
News December 1, 2025
42వేల మంది HIV బాధితులకు పెన్షన్లు: సత్యకుమార్

AP: 2030నాటికి HIV రహిత రాష్ట్రమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ‘HIV పాజిటివిటీ రేటు 0.10 శాతం నుంచి 0.04 శాతానికి తగ్గింది. కొత్త కేసుల్లో ITఉద్యోగులు ఉండటం ఆందోళనకరం. సేఫ్ సెక్స్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. దాదాపు 42వేల మంది HIV బాధితులకు పెన్షన్లు ఇస్తున్నాం. త్వరలో మిగిలిన అర్హులైన వారికీ పెన్షన్ల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.
News December 1, 2025
అసలేంటీ ‘బ్లాక్ ఫ్రైడే’ ?

1960ల్లో ఫిలడెల్ఫియాలో మొదలైన బ్లాక్ ఫ్రైడే ప్రస్తుతం భారతీయులకు షాపింగ్ ఫెస్టివల్ అయింది. మన క్యాలెండర్, కల్చర్లో లేని దానిని గ్లోబలైజేషన్, ఇన్ఫ్లూయెన్సర్లు, సోషల్ మీడియా.. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ (FOMO) అంటూ అలవాటు చేసేశాయి. డిస్కౌంట్కు నో చెప్పడానికి భారతీయులు ఇష్టపడరు. అదే రూ.వేల కోట్ల వ్యాపారానికి కేంద్రబిందువైంది. గ్లోబల్ బ్రాండ్స్ మొదలెట్టిన ఈ ట్రెండ్ను ఇంటర్నెట్ వైరల్ చేసేసింది.


