News December 23, 2025
BSF 549 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
Similar News
News December 24, 2025
ఖేల్రత్నకు హార్దిక్, అర్జునకు దివ్య, తేజస్వీ.. కమిటీ సిఫార్సు

హాకీ మెన్స్ టీమ్ వైస్ కెప్టెన్ హార్దిక్ సింగ్ను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డుకు సెలక్షన్ కమిటీ సిఫార్సు చేసింది. అథ్లెట్లు తేజస్వీ శంకర్, ప్రియాంక, నరేందర్ (బాక్సింగ్), విదిత్ గుజ్రాతీ, దివ్యా దేశ్ముఖ్ (చెస్), ధనుష్ శ్రీకాంత్ (డెఫ్ షూటింగ్), ప్రణతీ నాయక్ (జిమ్నాస్టిక్స్), రాజ్కుమార్ పాల్ (హాకీ), సుర్జీత్ (కబడ్డీ), నిర్మలా భాటి (ఖో ఖో)తోపాటు పలువురిని అర్జున అవార్డులకు రికమెండ్ చేసింది.
News December 24, 2025
పాస్టర్ల అకౌంట్లలో రూ.50 కోట్లు జమ

AP: సీఎం చంద్రబాబు హామీ మేరకు ఇవాళ పాస్టర్లకు రూ.50.10 కోట్లు గౌరవ వేతనం చెల్లించినట్లు మంత్రి ఫరూక్ తెలిపారు. 2024 డిసెంబర్ నుంచి 2025 నవంబర్ వరకు 12 నెలలకు రూ.5వేల చొప్పున 8,427 మంది అకౌంట్లలో డబ్బులు జమ చేసినట్లు మంత్రి తెలిపారు. క్రిస్మస్ను పురస్కరించుకొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమ, దయాగుణాన్ని ఇతరులకు పంచాలని క్రీస్తు ప్రజలకు బోధించడమే కాకుండా జీవించి చూపించారన్నారు.
News December 24, 2025
హోటల్గా రుషికొండ ప్యాలెస్.. 28న నిర్ణయం?

AP: రుషికొండ ప్యాలెస్ను హోటల్గా మార్చే అవకాశం ఉందని మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది. ఇందుకు తాజ్, లీలా ప్యాలెస్, అట్మాస్ కోర్, ఫెమా సంస్థలు ఆసక్తి చూపాయని మంత్రులు కేశవ్, దుర్గేశ్ వెల్లడించారు. ‘మాల్దీవ్, పుదుచ్చేరి బీచ్ హోటల్స్పై చర్చించాం. ప్రజలకు పనికొచ్చేలా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా వినియోగిస్తాం. గత ప్రభుత్వ నిర్ణయంతో నెలకు ₹25L భారం పడుతోంది’ అని చెప్పారు. ఈ 28న మరోసారి చర్చిస్తామన్నారు.


