News November 7, 2024
BSNL సంచలనం.. సిమ్ లేకుండానే కాల్స్, మెసేజ్లు?

సిమ్ లేకుండానే కాల్స్, మెసేజ్లు చేసేలా సరికొత్త టెక్నాలజీని BSNL త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో నెట్వర్క్ లేకపోయినా, సముద్రాలు, విపత్తులు, మారుమూల ప్రాంతాల్లో ఉన్నా సేవలు పొందవచ్చు. డైరెక్ట్ టూ డివైజ్ టెక్నాలజీ కోసం USకు చెందిన వయాశాత్తో కలిసి దీనిని పరీక్షిస్తోంది. శాటిలైట్, ప్రాంతీయ మొబైల్ నెట్వర్క్లను లింక్ చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది. శాటిలైట్లే సెల్ఫోన్ టవర్లు అవుతాయి.
Similar News
News November 25, 2025
UIDAIలో టెక్నికల్ కన్సల్టెంట్ ఉద్యోగాలు

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(<
News November 25, 2025
ఆకుకూరల సాగు- అనువైన నేలలు, వాతావరణం

తక్కువ సమయంలో రైతు చేతికొచ్చి, నిరంతరం ఆదాయం అందించే పంటల్లో ఆకుకూరలు ముందుంటాయి. ఆకుకూరలను మురుగు నీరు ఇంకిపోయే అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. నేల ఉదజని సూచిక 6.0 నుంచి 7.5గా ఉండాలి. వానాకాలం, వేసవి కాలం, 16 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న సమయం ఆకుకూరల పంటలు పెరగడానికి అత్యంత అనుకూలం. 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటే తోటకూరను సాగు చేయడం కష్టం.
News November 25, 2025
మేము లడ్డూ క్వాలిటీ విషయంలో రాజీపడలేదు: సజ్జల

AP: వైసీపీని టార్గెట్ చేస్తూ తిరుమల లడ్డూ విచారణ జరుగుతోందని వైసీపీ నేత సజ్జల అన్నారు. ‘కల్తీ నెయ్యి విచారణ పారదర్శకంగా జరగడం లేదు. మేము లడ్డూ క్వాలిటీ విషయంలో రాజీపడలేదు. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అప్పుడు ఇవే కంపెనీలు, ఇప్పుడూ ఇవే కంపెనీలు నెయ్యి సప్లై చేస్తున్నాయి.. నెయ్యి కల్తీకి ఎక్కడ అవకాశం ఉంది’ అని ప్రెస్ మీట్లో ప్రశ్నించారు.


