News November 7, 2024
BSNL సంచలనం.. సిమ్ లేకుండానే కాల్స్, మెసేజ్లు?

సిమ్ లేకుండానే కాల్స్, మెసేజ్లు చేసేలా సరికొత్త టెక్నాలజీని BSNL త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో నెట్వర్క్ లేకపోయినా, సముద్రాలు, విపత్తులు, మారుమూల ప్రాంతాల్లో ఉన్నా సేవలు పొందవచ్చు. డైరెక్ట్ టూ డివైజ్ టెక్నాలజీ కోసం USకు చెందిన వయాశాత్తో కలిసి దీనిని పరీక్షిస్తోంది. శాటిలైట్, ప్రాంతీయ మొబైల్ నెట్వర్క్లను లింక్ చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది. శాటిలైట్లే సెల్ఫోన్ టవర్లు అవుతాయి.
Similar News
News December 12, 2025
WTCలో ఆరో స్థానానికి పడిపోయిన ఇండియా

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో IND స్థానం మరింత దిగజారింది. తాజాగా WIపై NZ విజయం సాధించడంతో WTC పాయింట్ల పట్టికలో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ విజయంతో కివీస్ మూడో ప్లేస్కు చేరుకోగా భారత్ ఐదు నుంచి ఆరవ స్థానానికి పడిపోయింది. దీంతో భారత్కు <<18401686>>WTC<<>> ఫైనల్ ఆశలు సన్నగిల్లుతున్నాయి. ప్రస్తుతం AUS అగ్రస్థానంలో ఉండగా, SA రెండో స్థానంలో కొనసాగుతోంది.
News December 12, 2025
మోతాదుకు మించి ఎరువులు వద్దు

వ్యవసాయంలో నేల, నీరు, విత్తనం తర్వాత ఎరువులు కీలకపాత్ర పోషిస్తాయి. అధిక దిగుబడుల కోసం నిపుణుల సూచనలను పక్కనపెట్టి రైతులు ఎక్కువగా ఎరువులను వాడుతున్నారు. దీని వల్ల పెట్టుబడి భారం పెరగడంతో పాటు ఎరువుల వృథా జరుగుతోంది. అధికంగా వేసిన ఎరువులను మొక్కలు పరిమితంగానే వినియోగించుకుంటాయి. మిగిలినవి భూమిలోకి చేరుతాయి. అందుకే వ్యవసాయ అధికారుల సిఫార్సుల మేరకు పంట దశను బట్టి రైతులు ఎరువులను వాడటం మంచిది.
News December 12, 2025
మూడు రోజుల్లో రూ.3,760 పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ ఉదయం నుంచి <<18540435>>రెండు<<>> సార్లు బంగారం ధరలు పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు ఉదయం నుంచి రూ.2,450 పెరిగి రూ.1,33,200కు చేరింది. 3 రోజుల్లోనే రూ.3,760 పెరగడం గమనార్హం. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.2,250 ఎగబాకి రూ.1,22,100 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,15,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


