News April 11, 2024
బీటెక్ రవికి ప్రాణహాని ఉంది: కనకమేడల

AP: పులివెందులలో వైఎస్ జగన్పై పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి బీటెక్ రవికి ప్రాణహాని ఉందని ఆ పార్టీ సీనియర్ నేత కనకమేడల రవీంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పులివెందులలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని, రవికి ప్రాణహాని లేదంటూ ఎస్పీ తోసిపుచ్చుతున్నారని ఆరోపించారు. వెంటనే తమ అభ్యర్థికి భద్రత కల్పించాలని లేఖలో కోరారు.
Similar News
News January 17, 2026
RCB అభిమానులకు గుడ్న్యూస్

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్, ఇంటర్నేషనల్ మ్యాచులు నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ విషయాన్ని KA క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ప్రభుత్వ నిబంధనలు, షరతులకు లోబడి మ్యాచులు నిర్వహించుకోవాలని చెప్పినట్లు పేర్కొంది. కాగా గతేడాది ఆర్సీబీ ఐపీఎల్ కప్ గెలిచిన తర్వాత చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. అప్పటి నుంచి స్టేడియంపై నిషేధం ఉంది.
News January 17, 2026
మద్యం అమ్మకాల్లో వృద్ధి

TG: 2025 DEC నాటికి మద్యం అమ్మకాలు, ఆస్తి రిజిస్ట్రేషన్ల ఆదాయంలో రాష్ట్రం గణనీయ వృద్ధిని సాధించింది. ఆస్తి పన్ను వార్షిక లక్ష్యం ₹19,087CR కాగా 59.22% (₹11,304CR) సాధించినట్లు కాగ్ నివేదిక పేర్కొంది. 2024లో ఇది కేవలం 41.28% మాత్రమే. ఎక్సైజ్ ఆదాయం ₹27,263 CR లక్ష్యంలో 63.38% (₹17,507CR) సాధించింది. 2024లో ఇది 54.96%. ఇక అమ్మకపు పన్ను 2024లో DEC నాటికి 71% సాధించగా ఈసారి అది 67.07%కి తగ్గింది.
News January 17, 2026
జపాన్ వెకేషన్లో అల్లు అర్జున్.. ఫ్యామిలీ పిక్ వైరల్

టోక్యోలోని సెన్సో-జి ఆలయానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. భార్య స్నేహా రెడ్డి, కొడుకు అయాన్, కూతురు అర్హతో దిగిన ఫోటోను SMలో ఆయన షేర్ చేశారు. షేర్ చేసిన క్షణాల్లోనే ఈ పిక్ను అభిమానులు వైరల్ చేసేశారు. సినిమాలు, ఫ్యామిలీకి సమానంగా టైమ్ కేటాయిస్తూ ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకుంటున్నారని కామెంట్స్ పెడుతున్నారు.


