News October 9, 2025
BTG: వాగులో కొట్టుకుపోతున్న మహిళను రక్షించిన పోలీసులు

బుట్టాయగూడెం మండలం జైనవారిగూడెంకు చెందిన ఓ మహిళ జల్లెరు కాలువ దాటుతుండగా నీటి ప్రవాహానికి ప్రమాదవశాత్తు కొట్టుకుపోతుండగా పోలీసులు రక్షించారు. వెల్తురువారిగూడెం వెళ్తుండగా ఈ ప్రమాద ఘటన జరిగింది. ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు తన సిబ్బందితో కలిసి గాలించి, ఆమెను సురక్షితంగా రక్షించారు. వర్షాల కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్ఐ హెచ్చరించారు.
Similar News
News October 9, 2025
అపోలో వర్సిటీ ఘటనపై కేసు నమోదు

చిత్తూరు అపోలో యూనివర్సిటీలోని <<17959171>>గర్ల్స్ టాయిలెట్లో<<>> హిడెన్ కెమెరా అమర్చిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. చెన్నైకి చెందిన ఓ ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీలో సైట్ ఇంజినీరింగ్ పనిచేస్తున్న రూబెన్గా నిర్ధారించారు. ఈ మేరకు అతని నుంచి పోలీసులు ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు చిత్తూరు తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 9, 2025
విద్యార్థులకు ప్రయోగాత్మకంగా బోధించాలి: డీఈవో

విద్యార్థులకు ప్రయోగాత్మకంగా బోధించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిజిటల్ శిక్షణ కార్యక్రమాన్ని గురువారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు నేర్చుకున్నది పాఠశాలలో అమలు చేయాలని చెప్పారు. సమావేశంలో జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి పాల్గొన్నారు.
News October 9, 2025
బీఆర్ఎస్ చేసిన చట్టం బీసీలకు ఉరితాడులా మారింది: భట్టి

TG: రాష్ట్రంలో రిజర్వేషన్లు 50శాతానికి మించకుండా 2018లో BRS చేసిన చట్టం ఇప్పుడు OBCలకు ఉరితాడులా మారిందని Dy.CM భట్టి విక్రమార్క మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి దుష్టులు, దుర్మార్గులు అడ్డుకుంటారనే పక్కాగా కులగణన సర్వే చేశామన్నారు. బీసీలకు న్యాయం చేసేందుకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని సంకల్పించినట్లు చెప్పారు. కానీ కోర్టులో కేసులు వేసి బీసీల నోటి కాడ ముద్దను లాక్కుంటున్నారు’ అని ఆరోపించారు.