News March 20, 2025
BUDGET.. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులకే ప్రాధాన్యం

రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. KLIకు రూ.800కోట్లు, కోయిల్సాగర్ రూ. 80.73కోట్లు, నెట్టెంపాడుకు రూ.144కోట్లు, సంగంబండకు రూ.98.08కోట్లు, నల్లమలలో పర్యాటక అభివృద్ధికి రూ.242 కోట్లు, కురుమార్తి ఆలయ అభివృద్ధికి రూ.110 కోట్లు, పాలమూరు వర్సిటీకి రూ.50కోట్లు కేటాయించగా పాలమూరు ప్రాజెక్టుకు నిరాశే మిగిలింది. బడ్జెట్పై మిశ్రమ స్పందన వస్తోంది.
Similar News
News November 17, 2025
సంగారెడ్డిలో అద్భుత దృశ్యం ఆవిష్కరణ

సంగారెడ్డి పట్టణం మహబూబ్ సాగర్ చెరువు కట్ట హనుమాన్ మంత్రం సమీపంలో సోమవారం తెల్లవారుజామున అద్భుత దృశ్యం ఆవిష్కర్తమైంది. సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో పసుపు పచ్చని కాంతులతో పంట పొలాలు మారాయి. ఈ అద్భుత ఘట్టాన్ని కొందరూ తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. సూర్యుడిని చూసేందుకు ప్రజలు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు.
News November 17, 2025
పుల్కల్: అత్తారింటి వేధింపులకు వివాహిత ఆత్మహత్య

అత్తింటి వేధింపులకు వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పుల్కల్ మం.లో జరిగింది. స్థానికుల వివరాలు.. పెద్దారెడ్డిపేట వాసి పట్నం ప్రవీణ్కు వట్పల్లి మం. బిజిలిపూర్కు చెందిన లక్ష్మి(26)తో 20 నెలల క్రితం వివాహమైంది. అత్తమామలు, భర్త అదనపు కట్నం తేవాలని వేధించారు. పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీ పెట్టి సర్ది చెప్పినా మార్పు రాలేదు. దీంతో లక్ష్మి శనివారం ఇంట్లో ఉరి వేసుకుంది. మృతురాలికి 10 నెలల పాప ఉంది.
News November 17, 2025
నవజాత శిశువుల్ని ఇలా రక్షిద్దాం..

నవజాత శిశువుల్లో 80 శాతం మంది నెలలు వివిధ కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని యునిసెఫ్ నివేదిక తెలిపింది. వీటిని నివారించడానికి న్యూ బోర్న్ స్క్రీనింగ్ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. పుట్టిన 48-96 గంటల మధ్య ఈ పరీక్ష చేస్తారు. శిశువు మడమ నుండి రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తారు. దీనివల్ల వ్యాధులను ముందుగా గుర్తించడం వల్ల శారీరక, మానసిక వైకల్యాలతో సహా ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చు.


