News March 20, 2025
BUDGET.. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులకే ప్రాధాన్యం

రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. KLIకు రూ.800కోట్లు, కోయిల్సాగర్ రూ. 80.73కోట్లు, నెట్టెంపాడుకు రూ.144కోట్లు, సంగంబండకు రూ.98.08కోట్లు, నల్లమలలో పర్యాటక అభివృద్ధికి రూ.242 కోట్లు, కురుమార్తి ఆలయ అభివృద్ధికి రూ.110 కోట్లు, పాలమూరు వర్సిటీకి రూ.50కోట్లు కేటాయించగా పాలమూరు ప్రాజెక్టుకు నిరాశే మిగిలింది. బడ్జెట్పై మిశ్రమ స్పందన వస్తోంది.
Similar News
News November 21, 2025
విశాఖ ‘ఖాకీ’లపై ప్రత్యేక నిఘా..!(1/1)

రాష్ట్ర ఆర్థిక రాజధానిగా వృద్ధి చెందుతున్న విశాఖలో పలువురి <<18351380>>పోలీసుల తీరు<<>> చర్చకు దారి తీస్తోంది. సివిల్ సెటిల్మెంట్లు, రాజకీయ పైరవీలతో అంటకాగుతున్నారనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఇటీవల దువ్వాడలో రూ.కోట్ల విలువైన భూమి కోసం ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. లా అండ్ ఆర్ఢర్ కోణంలో ఈ ఇష్యూలో ఎంటరైన ఓ సీఐ సెటిల్మెంట్కు యత్నించటం ఉన్నతాధికారుల ద్రుష్టికి వెళ్ళింది. గతంలో ఆర్ఐ స్వర్ణలత ఇష్యూ సంచలనమైన సంగతి తెలిసిందే.
News November 21, 2025
విశాఖ ‘ఖాకీ’లపై ప్రత్యేక నిఘా..!(1/2)

విశాఖలో దీర్ఘకాలంగా పాతుకుపోయిన కొందరు పోలీసు అధికారులు ఇష్టారీతిన వ్యవహిస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో ఉన్నతాధికారులు అవినీతి పోలీసుల పనితీరుపై స్పెషల్ టీంతో నిఘా పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీపీ దృష్టిలో ఏ అధికారిపై రిమార్క్స్ ఎక్కువ వచ్చాయి? ఎవరి మీద యాక్షన్ ఉంటుంది? అన్న భయం ఖాకీల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టిస్తోంది. మీ పరిధిలో పోలీసులు పనితీరుపై కామెంట్ చెయ్యండి.
News November 21, 2025
ప.గో: రూ. 2కోట్లు గోల్ మాల్ ?

తణుకులోని ఓ ప్రైవేటు బ్యాంకులో తాకట్టు బంగారం గోల్మాల్ అయిన వ్యవహారం రాజుకుంటోంది. గతంలో ఇక్కడ పనిచేసిన సిబ్బందితో చేతులు కలిపిన తణుకు శాఖ మేనేజర్ ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని సొంత అవసరాలకు వాడుకున్న వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. ఖాతాదారులు నిలదీయడంతో బ్యాంకు అధికారులు బయట బంగారం కొనుగోలు చేసి ఇచ్చారు. ఇలా సుమారు రూ.2 కోట్లు విలువైన బంగారాన్ని దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది.


