News July 24, 2024
BUDGET: అందుకే దేశం వదిలి వెళుతున్నారని విమర్శలు

ట్యాక్స్ విషయంలో కేంద్రం తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. బడ్జెట్తో అసంతృప్తికి గురైన ఓ యూజర్ ‘నేను సంపాదించినా, ఖర్చు చేసినా, ఈరెండూ కాకుండా పెట్టుబడి పెట్టినా ట్యాక్స్ వేస్తారు. ట్యాక్స్పై మళ్లీ సెస్ వేస్తారు’ అని ట్వీట్ చేశారు. దానిపై కొందరు స్పందిస్తూ ఈ ట్యాక్స్ల వల్లే చాలామంది దేశాన్ని విడిచివెళ్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్కూ మద్దతు వస్తోంది.
Similar News
News October 7, 2025
కడుపులోని బిడ్డ ఆరోగ్యానికి విటమిన్ D

గర్భస్థ శిశువు ఆరోగ్యానికి విటమిన్ D ఎంతో అవసరమంటున్నారు పరిశోధకులు. ఫీటల్ స్కెలిటన్ గ్రోత్, ప్లాసెంటా, తల్లి రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు D విటమిన్ తగినంత ఉండాలని చెబుతున్నారు పెన్స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు. లేదంటే నెలలు నిండకుండా పుట్టడం, ఫీటల్ లెంత్ తక్కువగా ఉండటం వంటి సమస్యలు వస్తాయంటున్నారు. కాబట్టి ప్రెగ్నెన్సీకి ముందే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. <<-se>>#PregnancyCare<<>>
News October 7, 2025
కన్నడ ‘బిగ్బాస్’కు షాక్.. నిలిచిపోయిన షో

కన్నడ హీరో కిచ్చా సుదీప్ హోస్ట్ చేస్తున్న బిగ్బాస్ షో నిలిచిపోయింది. కర్ణాటక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(KSPCB) నోటీసులతో మేకర్స్ షూటింగ్ నిలిపేశారు. షూటింగ్ జరుగుతున్న జాలీవుడ్ స్టూడియోస్లో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టడం లేదని యాక్టివిస్టులు ఆందోళన చేయడంతో KSPCB చర్యలు తీసుకుంది. స్టూడియో నుంచి వస్తున్న కలుషిత నీటితో స్థానిక ఎకోసిస్టం దెబ్బతింటోందని పేర్కొంది.
News October 7, 2025
కనకాంబరం పూల సేకరణకు అనువైన సమయం ఏది?

తెలుగు రాష్ట్రాల్లో కనకాంబరం సాగు పెరిగింది. ఈ మొక్కలు నాటిన 2 నుంచి 3 నెలలకు పూత ప్రారంభమై, ఏడాది పొడవునా పూలు పూస్తాయి. జూన్ నుంచి జనవరి వరకు దిగుబడి ఎక్కువగా, వర్షాకాలంలో దిగుబడి కొద్దిగా తగ్గుతుంది. కనకాంబరం పూలను సరైన సమయంలో సేకరిస్తే అవి తాజాగా ఉండి మంచి ధర వస్తుంది. కనకాంబరం పూర్తిగా విచ్చుకోవడానికి రెండు రోజులు పడుతుంది. కాబట్టి రోజు విడిచి రోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పూలు కోయాలి.