News July 24, 2024
BUDGET: అందుకే దేశం వదిలి వెళుతున్నారని విమర్శలు

ట్యాక్స్ విషయంలో కేంద్రం తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. బడ్జెట్తో అసంతృప్తికి గురైన ఓ యూజర్ ‘నేను సంపాదించినా, ఖర్చు చేసినా, ఈరెండూ కాకుండా పెట్టుబడి పెట్టినా ట్యాక్స్ వేస్తారు. ట్యాక్స్పై మళ్లీ సెస్ వేస్తారు’ అని ట్వీట్ చేశారు. దానిపై కొందరు స్పందిస్తూ ఈ ట్యాక్స్ల వల్లే చాలామంది దేశాన్ని విడిచివెళ్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్కూ మద్దతు వస్తోంది.
Similar News
News October 12, 2025
తిరుమలలో రద్దీ.. దర్శనానికి 24 గంటలు

AP: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండి శిలాతోరణం వరకు భక్తులు క్యూలలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న 84,571 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హుండీకి రూ.3.70 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
News October 12, 2025
వరిలో పాముపొడ, ఆకుముడత తెగుళ్లు.. నివారణ

ముందుగా సాగుచేసిన వరిలో పాముపొడ తెగులు కనిపిస్తోంది. దీని నివారణకు ఎకరానికి 400 మి.లీ హెక్సాకొనజోల్ 5 SP లేదా 400 మి.లీ వాలిడామైసిన్ 3 SL లేదా 200 మి.లీ ప్రోపికొనజోల్ 25 శాతం EC వంటి మందులను పిచికారీ చేసుకోవాలి. ఆకుముడత, కాండం తొలుచు పురుగుల నివారణకు ఎకరానికి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 400గ్రా. లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 60 మి.లీ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
News October 12, 2025
పరీక్ష రాశాక ఆన్సర్ షీట్ చూసుకోవచ్చు

పోటీ పరీక్షల్లో పారదర్శకత కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ముఖ్య సంస్కరణలు చేసింది. ఇకపై మెరిట్ లిస్టును మార్కులుగా కాకుండా పర్సంటైల్గా వెల్లడిస్తుంది. అటు పేపర్ లీకేజీలు జరగకుండా డిజిటల్ వాల్టులు వినియోగించనుంది. ఇక ఆధార్ గుర్తింపుతో అభ్యర్థుల అటెండెన్స్ తీసుకుంటుంది. ముఖ్యంగా ఎగ్జామ్లో తమకు వచ్చిన క్వశ్చన్ పేపర్, ఇచ్చిన ఆన్సర్స్, కీ కాపీలను పరీక్ష తర్వాత ఆన్లైన్లో చూసుకోవచ్చని తెలిపింది.