News July 24, 2024

BUDGET: అందుకే దేశం వదిలి వెళుతున్నారని విమర్శలు

image

ట్యాక్స్ విషయంలో కేంద్రం తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. బడ్జెట్‌తో అసంతృప్తికి గురైన ఓ యూజర్ ‘నేను సంపాదించినా, ఖర్చు చేసినా, ఈరెండూ కాకుండా పెట్టుబడి పెట్టినా ట్యాక్స్ వేస్తారు. ట్యాక్స్‌పై మళ్లీ సెస్ వేస్తారు’ అని ట్వీట్ చేశారు. దానిపై కొందరు స్పందిస్తూ ఈ ట్యాక్స్‌ల వల్లే చాలామంది దేశాన్ని విడిచివెళ్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్‌కూ మద్దతు వస్తోంది.

Similar News

News October 11, 2025

భారత్ 518/5 డిక్లేర్

image

WIతో జరుగుతోన్న రెండో టెస్టులో భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 134.2 ఓవర్లలో టీమ్ ఇండియా 518/5 రన్స్ చేసింది. ఓపెనర్ జైస్వాల్ (175), గిల్ (129*) సెంచరీలతో రాణించారు. కేఎల్ రాహుల్ 38, సాయి సుదర్శన్ 87, నితీశ్ కుమార్ రెడ్డి 43, జురెల్ 44 రన్స్ చేశారు.

News October 11, 2025

WBలో మరో MBBS విద్యార్థినిపై అత్యాచారం

image

బెంగాల్‌లో మరో మెడికల్ స్టూడెంట్ రేప్‌కు గురైంది. ఒడిశాకు చెందిన ఆమె శోభాపూర్ కాలేజీలో చదువుతోంది. మిత్రుడితో కలిసి నిన్న 8.30PMకు తినేందుకు బయటకు వెళ్తుండగా క్యాంపస్ గేటు వద్ద ఓ వ్యక్తి పక్కకు లాక్కెళ్లి రేప్ చేశాడు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. డాక్టర్‌గా చూడాలని ఎన్నో ఆశలతో కుమార్తెను చదివిస్తున్నామని ఆమె తండ్రి రోదించారు. కోల్‌కతా ఆర్జీకర్ రేప్ ఘటనపై దేశవ్యాప్త నిరసనలు రేగడం తెలిసిందే.

News October 11, 2025

వారికి సరోగసీ నిబంధనలు వర్తించవు

image

సరోగసీ పేరెంట్స్ 2022 జనవరి 25కు ముందే పిండాలను శీతలీకరించే ప్రక్రియను చేపట్టి ఉంటే సరోగసీ చట్టం-2021లోని వయోపరిమితి నిబంధనలు వారికి వర్తించవని సుప్రీంకోర్టు పేర్కొంది. 2021లో రూపొందించిన చట్టం ఆ మరుసటి ఏడాది జనవరి 25 నుంచి అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రులుగా మారాలని ఆకాంక్షిస్తున్న వివాహితుల్లో భార్య వయసు 23-50 ఏళ్ల మధ్య ఉండాలి. తండ్రి వయసు 26-55 ఏళ్ల మధ్య ఉండాలి.