News July 24, 2024
BUDGET: అందుకే దేశం వదిలి వెళుతున్నారని విమర్శలు

ట్యాక్స్ విషయంలో కేంద్రం తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. బడ్జెట్తో అసంతృప్తికి గురైన ఓ యూజర్ ‘నేను సంపాదించినా, ఖర్చు చేసినా, ఈరెండూ కాకుండా పెట్టుబడి పెట్టినా ట్యాక్స్ వేస్తారు. ట్యాక్స్పై మళ్లీ సెస్ వేస్తారు’ అని ట్వీట్ చేశారు. దానిపై కొందరు స్పందిస్తూ ఈ ట్యాక్స్ల వల్లే చాలామంది దేశాన్ని విడిచివెళ్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్కూ మద్దతు వస్తోంది.
Similar News
News October 13, 2025
LED స్క్రీన్లో వేములవాడ రాజన్న దర్శనం

TG: వేములవాడ అభివృద్ధి పనుల నేపథ్యంలో LED స్క్రీన్ ద్వారా రాజరాజేశ్వర స్వామి దర్శనం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్జిత సేవలను కూడా అందించనున్నట్లు పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది మేడారం జాతర సందర్భంగా భక్తులు ఇక్కడికీ పెద్ద సంఖ్యలో తరలివస్తారని వెల్లడించారు. తొలుత భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక <<17983463>>ఏర్పాట్లు<<>> చేసిన విషయం తెలిసిందే.
News October 13, 2025
‘భారత కెప్టెన్ను మార్చాలి’.. ఫ్యాన్స్ డిమాండ్

స్వదేశంలో జరుగుతున్న ఉమెన్స్ వరల్డ్ కప్పై భారత జట్టుతో పాటు ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ SA, AUSపై వరుస ఓటములను జీర్ణించుకోలేకపోతున్నారు. గెలవాల్సిన మ్యాచ్ల్లో హర్మన్ కెప్టెన్సీ వల్లే ఓడిపోయామని ఫైరవుతున్నారు. బ్యాటింగ్లోనూ విఫలమవుతున్న తనను(21, 19, 9, 22) కెప్టెన్సీ నుంచి తొలగించాలని BCCIని డిమాండ్ చేస్తున్నారు. అటు IND సెమీస్కు వెళ్లాలంటే మిగతా 3 మ్యాచ్లూ కీలకం కానున్నాయి.
News October 13, 2025
యథాతథంగా విద్యుత్ ఉద్యోగుల సమ్మె

AP: ఈనెల 15 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె యథాతథంగా జరగనున్నట్లు విద్యుత్ ఉద్యోగులు తెలిపారు. ఉద్యోగుల జేఏసీతో యాజమాన్యాల చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయానికి వచ్చారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేవరకు పోరాటం ఆపేదే లేదని జేఏసీ స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు ర్యాలీలు, ధర్నాలతో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.