News February 28, 2025

BUDGET: ‘తల్లికి వందనం’కు రూ.10,300 కోట్లు!

image

AP: 2025 ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం రూ.3.25 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం నిధులు కేటాయించనుంది. ‘తల్లికి వందనం’కు రూ.10,300 కోట్లు, అన్నదాత సుఖీభవకు రూ.10,717 కోట్లు అవసరమని అంచనా వేశారు. అలాగే అమరావతి నిర్మాణం, పోలవరం, మహిళలకు వడ్డీలేని రుణాలకు నిధులు కేటాయించనుంది.

Similar News

News February 3, 2026

US-INDIA ట్రేడ్ డీల్ ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మైలురాయి: CBN

image

AP: USతో ట్రేడ్ డీల్ ముగించినందుకు PM మోదీకి CM CBN అభినందనలు తెలిపారు. ‘ఈ డీల్ చరిత్రాత్మకమైనది. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మైలురాయి వంటిది. టారిఫ్‌లను 18%కి తగ్గించడం 2 ప్రజాస్వామ్య దేశాల బంధాన్ని బలోపేతం చేస్తుంది. ప్రపంచ వృద్ధిని కాంక్షించే దార్శనిక చర్య ఇది. ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ తన పాత్రను సుస్థిరం చేసుకుంటోంది. APకి, యువత, రైతులకు అపార అవకాశాలు కల్పిస్తుంది’ అని Xలో పేర్కొన్నారు.

News February 3, 2026

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌(<>DMRC<<>>) 7 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు ఫిబ్రవరి 14 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, BE/BTech, MBA, LLB అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ/స్క్రీనింగ్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.delhimetrorail.com

News February 3, 2026

కోళ్లలో రక్తపారుడు.. తీవ్రమైతే మరణం తప్పదు

image

కోళ్లలో వైరస్, సూక్ష్మజీవుల వల్ల రక్తపారుడు వ్యాధి వస్తుంది. ఇది కూడా చిన్న కోడి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోగం వస్తే కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాధి బారినపడ్డ కోడి పిల్లలు ఒకేచోట గుమిగూడి రక్త విరేచనాలతో బాధపడతాయి. లక్షణాలు మరీ తీవ్రంగా మారితే కోడి పిల్లలు మరణించే అవకాశం ఉంది. వ్యాధి నివారణకు లిట్టరును పొడిగా ఉంచాలి. వెటర్నరీ నిపుణులకు తెలిపి వారి సలహాలను పాటించాలి.