News November 4, 2024

రూ.524 కోట్లతో ప్రజాప్రతినిధులు, అధికారుల బిల్డింగ్స్

image

AP: అమరావతిలో ప్రజాప్రతినిధులు, IAS, IPSల కోసం నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్ టవర్ల పెండింగ్ పనులను పూర్తి చేయడానికి CRDA సిద్ధమైంది. రూ.524 కోట్ల వ్యయ అంచనాతో త్వరలోనే టెండర్లు పిలవాలని నిర్ణయించింది. ఈ పనులను 9 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 18 టవర్ల నిర్మాణాన్ని 2017లో రూ.700 కోట్ల అంచనాతో ప్రారంభించి రూ.444 కోట్లు వెచ్చించింది. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పనులు ఆగిపోయాయి.

Similar News

News December 4, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 4, 2025

ఏపీకి రూ.125కోట్లు మంజూరు: పెమ్మసాని

image

AP: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.125 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు. SASCI, NAKSHA కార్యక్రమం కింద పట్టణ భూసమీకరణ వ్యవస్థను ఆధునికీకరించడం, 10 పట్టణ స్థానిక సంస్థల్లో(ULBs) చూపిన విశేష పురోగతికి గుర్తింపుగా ఈ మొత్తాన్ని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. PM మోదీ దూరదృష్టితో సీఎం చంద్రబాబు, Dy.CM పవన్ నాయకత్వంలో రాష్ట్రంలో పాలన మరింత బలోపేతమైందని ట్వీట్ చేశారు.

News December 4, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 4, గురువారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.14 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.31 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.06 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.57 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.