News November 4, 2024

రూ.524 కోట్లతో ప్రజాప్రతినిధులు, అధికారుల బిల్డింగ్స్

image

AP: అమరావతిలో ప్రజాప్రతినిధులు, IAS, IPSల కోసం నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్ టవర్ల పెండింగ్ పనులను పూర్తి చేయడానికి CRDA సిద్ధమైంది. రూ.524 కోట్ల వ్యయ అంచనాతో త్వరలోనే టెండర్లు పిలవాలని నిర్ణయించింది. ఈ పనులను 9 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 18 టవర్ల నిర్మాణాన్ని 2017లో రూ.700 కోట్ల అంచనాతో ప్రారంభించి రూ.444 కోట్లు వెచ్చించింది. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పనులు ఆగిపోయాయి.

Similar News

News November 22, 2025

ములుగు: టీఆర్‌పీ సోషల్ మీడియా కన్వీనర్ల నియామకం

image

తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లాలోని 10 మండలాలకు సోషల్ మీడియా కన్వీనర్లను ప్రకటించింది. ములుగుకు బుద్దే రాజు, వెంకటాపూర్- దుగ్గొని నిశాల్, గోవిందరావుపేట- సునావత్ మోహన్ రావు, ఏటూరునాగారం- గగ్గురీ రాంబాబు, వాజేడు- బొల్లె రమేష్, వెంకటాపురం- శ్రీరామ్ నాగ సునీల్, కన్నాయిగూడెం- భీముని నరేష్, మంగపేట- బండి సందీప్, మల్లంపల్లి- నూనె రాజ్ కుమార్‌లను నియమించినట్లు జిల్లా కన్వీనర్ తెలిపారు.

News November 22, 2025

ఏపీలోనూ సర్పంచ్ ఎన్నికలు.. సన్నాహాలు షురూ!

image

TGలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు జరుగుతుండగా APలోనూ సన్నాహాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల జాబితాను SEC సేకరించినట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారుచేయగానే నోటిఫికేషన్ విడుదలచేసే ఛాన్స్ ఉంది. కాగా APలో 2021 FEB, APRలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి.

News November 22, 2025

ఈ-రేస్ కేసులో ఏసీబీ రిపోర్ట్.. నిందితులు వీరే

image

TG: ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ ఫైనల్ రిపోర్టు బయటికొచ్చింది. A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా బీఎల్ఎన్ రెడ్డి, A4గా కిరణ్ మల్లేశ్వరరావు, A5గా ఈ-రేస్ కంపెనీ FEO పేర్లను పొందుపరిచింది. 2024 డిసెంబర్ 19న కేసు నమోదవగా ఈ ఏడాది సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి నివేదిక పంపింది. కాగా ఈ కేసులో ఛార్జ్‌షీట్ నమోదుకు, కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ గవర్నర్ ఇటీవల ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే.