News June 25, 2024

బుల్ జోరు.. ఆల్ టైమ్ రికార్డులతో మార్కెట్లు క్లోజ్

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్‌ను లాభాలతో ముగించాయి. తొలిసారిగా సెన్సెక్స్ 78వేల మార్క్, నిఫ్టీ 23,700 దాటి జీవిత కాల గరిష్ఠాన్ని నమోదు చేశాయి. 712 పాయింట్ల లాభంతో 78,053 వద్ద సెన్సెక్స్, 183 పాయింట్ల లాభంతో 23,721 వద్ద నిఫ్టీ ట్రేడింగ్ ముగించాయి. రియల్టీ షేర్లు నష్టాలను నమోదు చేసినా బ్యాంకింగ్ రంగం దూసుకెళ్లడంతో ఆ ప్రభావం మార్కెట్‌పై పెద్దగా కనిపించలేదు.

Similar News

News December 28, 2025

కేజీ చికెన్ రూ.300.. మాంసం ప్రియులకు షాక్

image

తెలుగు రాష్ట్రాల్లో గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ.300గా ఉంది. విజయవాడలో కేజీ రూ.280, వరంగల్‌లో రూ.290, గుంటూరులో రూ.260, శ్రీకాకుళంలో రూ.305కి విక్రయిస్తున్నారు. గత వారం HYDలో కేజీ రూ.250 ఉండగా ఇప్పుడు రూ.50 వరకు పెరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. అటు కోడిగుడ్డు ధర రూ.8గా ఉంది.

News December 28, 2025

డిగ్రీ అర్హతతో 451 పోస్టులు.. అప్లై చేశారా?

image

త్రివిధ దళాల్లో 451 ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. CDSE-2026 ద్వారా UPSC వీటిని భర్తీ చేయనుంది. ఇంజినీరింగ్, డిగ్రీ ఉత్తీర్ణులై, 20 -24ఏళ్ల మధ్య వయసు గలవారు అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.200. SC, ST, మహిళలకు ఫీజు లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: upsconline.nic.in. *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News December 28, 2025

కోటీశ్వరుడు.. ర్యాపిడో డ్రైవరయ్యాడు

image

కరోనా కష్టాలు ఒక కోటీశ్వరుడిని ర్యాపిడో డ్రైవర్‌గా మార్చేశాయి. ఒకప్పుడు ₹కోట్లలో వ్యాపారం చేసిన ఆయన కొవిడ్ వల్ల ఏకంగా ₹14 కోట్లు నష్టపోయారు. చేతిలో చిల్లిగవ్వ లేక ఉపాధి కోసం ర్యాపిడో నడుపుతున్నారు. Amity యూనివర్సిటీలో చదివిన అతడు ఒక ప్రయాణికుడితో తన బాధ పంచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న కథ నెట్టింట వైరలవుతోంది. ‘ఇప్పటికీ దేవుడిపై నమ్మకం ఉంది. ఓటమిని ఒప్పుకోను’ అంటున్న ఆయన ధైర్యం కదిలిస్తోంది.