News March 19, 2024
2026 నాటికి బుల్లెట్ రైలు పరుగులు: అశ్వినీ వైష్ణవ్
దేశంలోనే తొలి బుల్లెట్ రైలు <<12656938>>ప్రాజెక్టు<<>> ఫస్ట్ ఫేజ్ 2026 నాటికి పూర్తవుతుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. తొలుత సూరత్ నుంచి బిలిమోరా వరకు రైలును నడుపుతామని, అహ్మదాబాద్- ముంబై మార్గం 2028కి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి తొలి మేడిన్ ఇండియా చిప్ను తీసుకొస్తామన్నారు. ఐదేళ్లలో సెమీకండక్టర్ల ఉత్పత్తిలో దేశం ఐదో స్థానానికి చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News July 8, 2024
ఏపీ టెట్ షెడ్యూల్లో మార్పులు
AP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) షెడ్యూల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. జులై 2న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ జరగాల్సి ఉండగా, ఆ పరీక్షలను అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తామని తెలిపింది. ప్రిపరేషన్కు సమయం కోసం అభ్యర్థుల వినతి మేరకు సవరణ నోటిఫికేషన్ను ఇవాళ రిలీజ్ చేసింది. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
News July 8, 2024
ఏపీ టెట్ కొత్త షెడ్యూల్ ఇదే..
✒ పరీక్ష ఫీజు చెల్లింపు: ఇప్పటికే ప్రారంభం కాగా ఆగస్టు 3 వరకు అవకాశం
✒ ఆన్లైన్ దరఖాస్తులు: ఆగస్టు 3 వరకు
✒ ఆన్లైన్ మాక్టెస్ట్: సెప్టెంబర్ 19 నుంచి
✒ పరీక్షలు: అక్టోబర్ 3 నుంచి 20 వరకు(2 సెషన్లలో)
✒ ప్రొవిజినల్ కీ: అక్టోబర్ 4నుంచి
✒ ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: అక్టోబర్ 5 నుంచి
✒ తుది కీ విడుదల: అక్టోబర్ 27
✒ ఫలితాలు విడుదల: నవంబర్ 2న
News July 8, 2024
స్మృతి మంధాన లవర్ ఇతనే..
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధానతో రిలేషన్ను మ్యూజిక్ కంపోజర్ పలాశ్ ముచ్ఛల్ అధికారికంగా ప్రకటించారు. తమ ప్రేమ బంధానికి ఐదేళ్లు పూర్తయ్యాయని తెలుపుతూ వారిద్దరూ కేక్ కట్ చేస్తున్న ఫొటోను ఇన్స్టాలో షేర్ చేశారు. ఆ పోస్ట్కు మంధాన లవ్ సింబల్స్తో కామెంట్ చేసింది. కాగా స్మృతి, పలాష్ పలుమార్లు కలిసి కనిపించినా తమ బంధంపై ఎప్పుడూ నోరువిప్పలేదు.