News February 4, 2025
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్

హైదరాబాద్-ముంబై మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి. 709K.M దూరమున్న ఈ ప్రాజెక్టు ఫైనల్ లొకేషన్ సర్వే కోసం రైల్వే శాఖ టెండర్లు పిలిచింది. ఈ నెల 24లోగా బిడ్లు దాఖలు చేయాలని సూచించింది. బుల్లెట్ రైలులో 2 గంటల్లోనే HYD నుంచి ముంబై చేరుకోవచ్చు. ఆ తర్వాత హైదరాబాద్-బెంగళూర్, చెన్నై మధ్య కారిడార్లు నిర్మించాలనే ఆలోచనతో ఉంది. ప్రస్తుతం ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ మార్గం సిద్ధమవుతోంది.
Similar News
News November 24, 2025
సిద్దిపేట: అమ్మా.. నన్ను కొడుతున్నారు.. ఇవే చివరి మాటలు

సెలూన్కు వెళ్లిన యువకుడు తనను నలుగురు కొడుతున్నారంటూ తల్లికి ఫోన్ చేశాడు. తల్లి వెంటనే అక్కడికి వెళ్లి చూడగా విగత జీవిగా కనిపించిన విషాద ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. ములుగు మం. బస్వాపూర్ వాసి నర్సంపల్లి సందీప్(21) తుర్కపల్లి కంపెనీలో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి సెలూన్కు వెళ్లి ఇంటికి రాలేదు. తల్లి రేణుక ఫోన్ చేయగా నలుగురు కొడుతున్నట్లు చెప్పి ఫోన్ కట్ చేయగా వెళ్లి చూస్తే చనిపోయి ఉన్నాడు.
News November 24, 2025
32,438 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

RRB గ్రూప్-D పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. <
News November 24, 2025
ఈ డిగ్రీ ఉంటే జాబ్ గ్యారంటీ!

కంప్యూటర్ సైన్స్ డిగ్రీ హోల్డర్లకే వచ్చే ఏడాది ఎక్కువ ఉద్యోగావకాశాలు ఉన్నట్లు ఇండియా స్కిల్స్ రిపోర్టు-2026 వెల్లడించింది. వారిలో ఎంప్లాయిబిలిటీ రేటు 80%గా ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో IT(78%), B.E/B.Tech(70%), MBA(72.76%), కామర్స్(62.81%), నాన్ IT సైన్స్(61%), ఆర్ట్స్(55.55%), ITI-ఒకేషనల్(45.95%), పాలిటెక్నిక్(32.92%) ఉన్నట్లు అంచనా వేసింది. డిగ్రీతోపాటు స్కిల్స్ ముఖ్యమని పేర్కొంది.


