News October 15, 2024

BUMPER OFFER: వైన్ షాప్ వదిలేస్తే రూ.కోటి!

image

AP: వ్యక్తిగతంగా వైన్ షాపులు దక్కించుకున్నవారికి సిండికేట్లు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. దుకాణ నిర్వహణ కోసం దాదాపు రూ.40 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ అంత స్థోమత లేనివారిపై సిండికేట్లు ఒత్తిడి చేస్తున్నారు. షాపు వదిలేస్తే రూ.కోటి నుంచి రూ.1.2 కోట్ల వరకు ముట్టచెబుతామని చెబుతున్నారు. అలాగే గుడ్ విల్ కింద నెల నెలా రూ.15 వేలు కూడా ఇస్తామని ప్రకటించడంతో డ్రాలో అదృష్టం వరించిన వారు ఆలోచనలో పడ్డారు.

Similar News

News November 2, 2025

రేపు పిడుగులతో కూడిన వర్షాలు

image

ఏపీలోని కర్నూలు, తిరుపతి జిల్లాల్లో రేపు పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. మిగతా జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన చెదురుమదురు వానలు పడతాయని తెలిపింది. అటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది.

News November 2, 2025

ఇస్రో దేశ ప్రజలను గర్వపడేలా చేస్తోంది: మోదీ

image

అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03 ప్రయోగం <<18179210>>విజయవంతం<<>> కావడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. మన అంతరిక్ష రంగం దేశ ప్రజల్ని గర్వపడేలా చేస్తూనే ఉందని కొనియాడారు. ఇస్రోకు అభినందనలు తెలిపారు. ‘మన సైంటిస్టుల ఘనత వల్ల అంతరిక్ష రంగం నూతన ఆవిష్కరణలకు, ప్రయోగాలకు పర్యాయపదంగా మారింది. వారి విజయాలు దేశ అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. ఎన్నో జీవితాలకు సాధికారత కల్పిస్తున్నాయి’ అని ట్వీట్ చేశారు.

News November 2, 2025

రాజకీయ హింస.. ఏడాదిలో 281 మంది మృతి

image

విద్యార్థుల ఆందోళనలతో బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా అధికారం కోల్పోయినప్పటికీ పొలిటికల్ వయలెన్స్ కొనసాగుతూనే ఉంది. గత ఏడాది AUG నుంచి ఈ ఏడాది SEP వరకు అల్లర్లలో 281 మంది మరణించారని మానవ హక్కుల సంఘం వెల్లడించింది. అలాగే అక్రమ నేరారోపణలతో 40 మంది చట్టవిరుద్ధ హత్యలకు గురయ్యారని తెలిపింది. మరో 153 మందిని దారుణంగా ఉరితీశారని పేర్కొంది. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు జవాబుదారీగా ఉండటం లేదని అభిప్రాయపడింది.