News March 30, 2024
ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బుమ్రా?

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యపై యాజమాన్యం వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. అతడిపై ముంబై ఫ్రాంచైజీ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఆ జట్టు ఓటములకు అతడే కారణమని భావిస్తున్నట్లు టాక్. దీంతో ఆ జట్టు పగ్గాలను స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు అప్పగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మేనేజ్మెంట్ తీవ్ర ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సీజన్లో ముంబై ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైంది.
Similar News
News November 10, 2025
ఆర్థిక మోసానికి గురయ్యారా? ఇలా ఫిర్యాదు చేయండి

ఆర్థిక మోసాలకు గురైన బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు Sachet పోర్టల్ను RBI ప్రారంభించింది. అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తున్న సంస్థలు/వ్యక్తుల గురించి ఫిర్యాదు చేయడానికి దీనిని రూపొందించారు. మీరు మోసపోయినట్లయితే <
News November 10, 2025
మెడికల్ విద్య కోసం ఇప్పుడు జార్జియా వైపు!

భారత్ నుంచి అనేకమంది వైద్యవిద్య కోసం గతంలో ఉక్రెయిన్కు వెళ్లేవారు. రష్యాతో యుద్ధంతో ఇప్పుడు జార్జియా వైపు మళ్లుతున్నారు. RBI ప్రకారం అక్కడ ఈ చదువు కోసం 2018-19లో $10.33M వెచ్చించగా 2024-25లో అది $50.25Mలకు పెరిగింది. కాగా వారు ఇండియా వచ్చాక NExT/FMGE పాస్ కావాలి. జార్జియా నుంచి వచ్చే వారిలో 35% మాత్రమే ఉత్తీర్ణులవుతున్నారు. అక్కడి వర్సిటీల గురించి ముందే తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News November 10, 2025
PM కిసాన్ లిస్టులో మీ పేరు లేదా? కారణమిదే!

PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం నుంచి లక్షలాది మంది లబ్ధిదారులను తొలగించారన్న ప్రచారంపై కేంద్రం వివరణ ఇచ్చింది. ‘గైడ్లైన్స్ ప్రకారం 2019 FEB 1 తర్వాత భూమి కొన్న వారికి ఈ స్కీమ్ వర్తించదు. ఒకే ఫ్యామిలీ నుంచి భర్త, భార్య, పిల్లలు వేర్వేరుగా లబ్ధి పొందుతున్నట్లు గుర్తించాం. అలాంటి వారికి తాత్కాలికంగా నిలిపివేశాం. ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత అర్హులని తేలితే మళ్లీ జాబితాలో చేర్చుతాం’ అని పేర్కొంది.


