News November 22, 2024
రహానే సరసన బుమ్రా నిలుస్తారా?

AUS గడ్డపై కెప్టెన్సీ చేసిన తొలి టెస్టులో గెలిచిన ఏకైక భారత కెప్టెన్గా రహానే పేరిట రికార్డు ఉంది. నేడు ప్రారంభం కానున్న BGT తొలి టెస్టులో భారత్ గెలిస్తే రహానే సరసన బుమ్రా చేరనున్నారు. AUSలో బుమ్రాకు కెప్టెన్గా ఇదే ఫస్ట్ టెస్ట్. కాగా గతంలో అమర్నాథ్, చందు బోర్డే, పటౌడీ, బిషన్, గవాస్కర్, అజహరుద్దీన్, సచిన్, కుంబ్లే, ధోనీ, సెహ్వాగ్, కోహ్లీ AUSలో కెప్టెన్గా తమ తొలి టెస్టులో ఓడారు.
Similar News
News January 5, 2026
ఎన్ని నీళ్లు వాడుకున్నా అడ్డు చెప్పలేదు: సీఎం చంద్రబాబు

AP: తెలంగాణతో నీటి వివాదాలపై CM చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే తెలంగాణ ఎన్ని నీళ్లు వాడుకున్నా ఎప్పుడూ అడ్డుచెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం కట్టినా ఫర్వాలేదు మనకూ నీళ్లు వస్తాయని ఊరుకున్నాం. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు సమైక్యత అవసరం. నీటి విషయంలోగానీ సహకారంలోగానీ తెలుగు వారంతా కలిసే ఉండాలి’ అని తెలుగు మహా సభల సందర్భంగా పిలుపునిచ్చారు.
News January 5, 2026
ప్రీ టర్మ్ బర్త్ను నివారించాలంటే?

డెలివరీ డేట్ కంటే చాలాముందుగా డెలివరీ కావడాన్ని ప్రీ టర్మ్ డెలివరీ అంటారు. దీనివల్ల పిల్లలకు అనేక సమస్యలు వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే ప్రతి నెలా రెగ్యులర్ చెకప్స్, పౌష్టికాహారం తీసుకోవాలి. మూత్రనాళ, దంత ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవాలి. ఒత్తిడి లేకుండా ఉండాలి. ప్రెగ్నెన్సీలో పొగ, మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి. పొత్తికడుపులో నొప్పి, రక్తస్రావం, ఉమ్మనీరు లీక్ ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.
News January 5, 2026
పోలవరం-నల్లమల సాగర్.. విచారణ వాయిదా

SCలో పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై విచారణ ఈనెల 12కు వాయిదా పడింది. కేటాయింపులకు విరుద్ధంగా AP నీళ్లను వాడుకుంటోందని TG వాదించింది. అయితే ప్రాజెక్టు నివేదిక, అధ్యయనానికి కేంద్రం అనుమతి తీసుకున్నామని AP తెలిపింది. TG గోదావరిపై వందల ప్రాజెక్టులు నిర్మిస్తోందని వాదించింది. పరీవాహక రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, మధ్యవర్తిత్వం ద్వారా ఎందుకు పరిష్కరించుకోకూడదని SC వ్యాఖ్యానించింది.


