News March 23, 2025
అట్లీ సినిమాలో బన్నీ డ్యుయల్ రోల్?

తమిళ డైరెక్టర్ అట్లీతో చేయబోయే సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒక క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని, సినిమాలో మెయిన్ విలన్ పాత్ర అదేనని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ‘పుష్ప’ సినిమాలోని పుష్పరాజ్ పాత్రలోనూ కొంతవరకు నెగటివ్ షేడ్స్ ఉన్న సంగతి తెలిసిందే.
Similar News
News March 24, 2025
మరో ఎన్నికల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 28న నోటిఫికేషన్ వెలువడనుండగా ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. 25న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాగా ఇటీవల రాష్ట్రంలో టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
News March 24, 2025
ప్రభాస్ ఫ్యాన్స్కు పూనకాలే.. త్వరలో ‘ది రాజాసాబ్’ టీజర్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న ‘ది రాజాసాబ్’ సినిమా టీజర్ విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే రఫ్ కట్ వీడియోను ఇండస్ట్రీ మిత్రులకు మారుతి చూపించగా.. ఫ్రభాస్ను ఇలా ఎప్పుడూ చూడలేదని అందరూ చెప్పినట్లు సినీవర్గాల్లో టాక్. డైలాగులు, ప్రభాస్ లుక్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తాయని సమాచారం. ఈ చిత్రం సర్ప్రైజింగ్ విజువల్ ట్రీట్ ఇవ్వనుందని సినీవర్గాలు తెలిపాయి.
News March 24, 2025
అరటి రైతులను పరామర్శించిన జగన్

AP: కడప జిల్లా లింగాల మండలంలో మాజీ సీఎం జగన్ పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులతో మండలంలోని తాతిరెడ్డి పల్లె, కోమన్నూతల, ఎగువపల్లె గ్రామాల్లో నేలకొరిగిన అరటి తోటలను పరిశీలించి బాధిత రైతులను పరామర్శించారు. మండలంలో 2,460 ఎకరాల్లో అరటి పంట నష్టపోయినట్లు ఉద్యానశాఖ అధికారి రాఘవేంద్రారెడ్డి జగన్కు తెలిపారు. తమను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఈ సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.