News September 7, 2024

బుడమేరు గండ్ల పూడ్చివేత పూర్తయ్యింది: నిమ్మల

image

AP: బుడమేరు గండ్ల పూడ్చివేత పూర్తయ్యిందని, దిగువకు వరద ప్రవాహం తగ్గిందని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. CM చంద్రబాబు 24గంటలు కలెక్టరేట్‌లోనే ఉండి పనులు పర్యవేక్షించారని చెప్పారు. వర్షం పడితే మళ్లీ సమస్య రాకుండా కట్ట ఎత్తు పెంచుతామన్నారు. ఆ పనులు కూడా వెంటనే చేపడుతున్నామన్నారు. విజయవాడలో ఉన్న నీరు కూడా క్రమంగా తగ్గుతోందని తెలిపారు. అవసరమైతే మోటార్లు పెట్టి నీటిని తోడిపోస్తామన్నారు.

Similar News

News November 18, 2025

చావడానికి సిద్ధంగా ఉన్నా: యువరాజ్ తండ్రి

image

తన జీవితం ముగిసిపోయిందని, చావడానికి సిద్ధంగా ఉన్నానని యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ అన్నారు. తన స్వగ్రామంలో ఒంటరిగా గడుపుతున్నానని, ఆహారం కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాన్ని ప్రేమిస్తానని, ఎవరినీ సాయం అడగనని చెప్పారు. తాను కొన్ని తప్పులు చేసి ఉండొచ్చని, కానీ ఎవరికీ ఎలాంటి అపకారం చేయలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వృద్ధాప్యంలో ఎవరూ తోడుగా లేరని వాపోయారు.

News November 18, 2025

చావడానికి సిద్ధంగా ఉన్నా: యువరాజ్ తండ్రి

image

తన జీవితం ముగిసిపోయిందని, చావడానికి సిద్ధంగా ఉన్నానని యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ అన్నారు. తన స్వగ్రామంలో ఒంటరిగా గడుపుతున్నానని, ఆహారం కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాన్ని ప్రేమిస్తానని, ఎవరినీ సాయం అడగనని చెప్పారు. తాను కొన్ని తప్పులు చేసి ఉండొచ్చని, కానీ ఎవరికీ ఎలాంటి అపకారం చేయలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వృద్ధాప్యంలో ఎవరూ తోడుగా లేరని వాపోయారు.

News November 18, 2025

ఏపీ న్యూస్ అప్డేట్స్

image

*YCP హయాంలో పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు చూపించినా MLA పదవికి రాజీనామా చేస్తా: గంటా శ్రీనివాసరావు
*నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్దన్, ఏ2 జగన్మోహన్‌ను ఈ నెల 19 నుంచి 22 వరకు కస్టడీకి అప్పగిస్తూ ఎక్సైజ్ కోర్టు ఉత్తర్వులు.
*TTD పరకామణిలో చోరీ కేసు దొంగలే సతీశ్ కుమార్‌ను అంతమొందించారు. YS వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించినట్లే సతీశ్ హత్యను ఆత్మహత్యగా ప్రచారం చేస్తున్నారు: మంత్రి పార్థసారథి