News September 7, 2024

బుడమేరు గండ్ల పూడ్చివేత పూర్తయ్యింది: నిమ్మల

image

AP: బుడమేరు గండ్ల పూడ్చివేత పూర్తయ్యిందని, దిగువకు వరద ప్రవాహం తగ్గిందని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. CM చంద్రబాబు 24గంటలు కలెక్టరేట్‌లోనే ఉండి పనులు పర్యవేక్షించారని చెప్పారు. వర్షం పడితే మళ్లీ సమస్య రాకుండా కట్ట ఎత్తు పెంచుతామన్నారు. ఆ పనులు కూడా వెంటనే చేపడుతున్నామన్నారు. విజయవాడలో ఉన్న నీరు కూడా క్రమంగా తగ్గుతోందని తెలిపారు. అవసరమైతే మోటార్లు పెట్టి నీటిని తోడిపోస్తామన్నారు.

Similar News

News November 18, 2025

BIG ALERT: మీకు ఇలాంటి మెసేజ్ వచ్చిందా?

image

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మార్గంలో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే SBI YONO యాప్ బ్లాక్ అవుతుందంటూ వాట్సాప్ మెసేజ్‌లు చేస్తున్నారు. SBI లోగోను డీపీగా పెట్టుకుని APK ఫైల్స్‌ను పంపుతున్నారు. దీన్ని క్లిక్ చేస్తే అప్డేట్ అవుతుందని చెబుతున్నారు. అయితే SBI అలాంటి ఫైల్స్‌ను ఎప్పుడూ పంపదని, వాటిని క్లిక్ చేయొద్దని PIB Fact Check స్పష్టం చేసింది.
#ShareIt

News November 18, 2025

BIG ALERT: మీకు ఇలాంటి మెసేజ్ వచ్చిందా?

image

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మార్గంలో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే SBI YONO యాప్ బ్లాక్ అవుతుందంటూ వాట్సాప్ మెసేజ్‌లు చేస్తున్నారు. SBI లోగోను డీపీగా పెట్టుకుని APK ఫైల్స్‌ను పంపుతున్నారు. దీన్ని క్లిక్ చేస్తే అప్డేట్ అవుతుందని చెబుతున్నారు. అయితే SBI అలాంటి ఫైల్స్‌ను ఎప్పుడూ పంపదని, వాటిని క్లిక్ చేయొద్దని PIB Fact Check స్పష్టం చేసింది.
#ShareIt

News November 18, 2025

INTRESTING: కృష్ణాంగారక చతుర్దశి కథ

image

పూర్వం అవంతీ నగరంలో భరద్వాజ మహర్షికి అప్సరసపై మోహం కలగగా, వీర్యం భూమిపై పడింది. దీంతో ఎర్రటి కుసుమం వంటి బాలుడు జన్మించాడు. అతడే అంగారకుడు. అతణ్ని భూదేవి పెంచింది. భరద్వాజుడు ఉపనయనం చేసి, గణపతి మంత్రాన్ని ఉపదేశించాడు. అంగారకుడు ఓనాడు నర్మదా తీరాన నిష్ఠగా జపించగా, గణపతి సాక్షాత్కరించాడు. అప్పుడు అంగారకుడు తన పేరుతో ఓరోజు మంగళకరం కావాలని, ఆ రోజున గణపతిని పూజిస్తే కష్టాలు తొలగిపోవాలని వరం కోరాడు.