News March 29, 2025
మండుతున్న ఎండలు.. 150 మండలాల్లో 40+ డిగ్రీలు

AP: రాష్ట్రంలో వడగాలులు, ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఇవాళ 150కిపైగా మండలాల్లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదైనట్లు IMD వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. కొమరోలు, నంద్యాల, కమలాపురంలో 42.5, రుద్రవరం, అనకాపల్లిలో 42, కోసిగి, తాడిమర్రిలో 41 డిగ్రీలు రికార్డయినట్లు పేర్కొంది. మధ్యాహ్నం వేళ అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని సూచించింది.
Similar News
News April 1, 2025
నా పిల్లలు ఇండియాలోనే పెరగాలి: అమెరికన్ తల్లి

తన పిల్లలు భారతదేశంలో పెరిగితేనే ప్రయోజకులు అవుతారని ఓ అమెరికన్ తల్లి SMలో పోస్ట్ చేశారు. ఢిల్లీలో నాలుగేళ్లుగా నివాసం ఉంటున్న క్రిస్టెన్ ఫిషర్ ఈ పోస్ట్ పెట్టారు. ‘సంపాదనపరంగా US బెస్ట్ ఏమో కానీ.. సంతోషం మాత్రం భారత్లోనే దొరుకుతుంది. ఇక్కడ నివసిస్తే భావోద్వేగాలను హ్యాండిల్ చేయొచ్చు. లోతైన సంబంధాలు ఏర్పరచుకోవచ్చు. సర్దుకుపోవడం అలవాటు అవుతుంది. కృతజ్ఞతాభావం పెరుగుతుంది’ అంటూ పేర్కొన్నారు.
News April 1, 2025
ఏప్రిల్ 1: చరిత్రలో ఈరోజు

1578: రక్తప్రసరణ సిద్ధాంతాన్ని వివరించిన ఆంగ్ల వైద్యుడు విలియం హార్వే జననం 1889: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు కేశవ్ బలీరాం హెడ్గేవార్ జననం
1935: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన
1936: ఒడిశా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
1941: భారత మాజీ క్రికెటర్ అజిత్ వాడేకర్ జననం
2022: తెలుగు చిత్ర దర్శకుడు శరత్ మరణం
News April 1, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.